మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరప్ చేసిన ఆయన ఇలాకాలో టీఆర్ఎస్ పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వర్గాలకు ఆయన వెంటే వుంటూ తమ స్వామిభక్తిని చాటుకోగా, పార్టీలో ఆయన వర్గం వెళ్లిపోవడంతో ఇప్పుడైనా తమకు సముచితస్థానం దక్కుతుందని అశిస్తున్న క్రియాశీలక నేతలకు మధ్య పోరపచ్చాలు కూడా వచ్చేశాయి, అయితే ఆయన ఉద్వాసనకు గురైన నేపథ్యంలో ఇక పార్టీని ముందుకు నడిపే నాయకుడు ఎవరన్న విషయంలో పార్టీ కార్యకర్తలు నిరాశ, నిసృహలకు లోను కాకుండా టీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది.
ఈ క్రమంలో కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ క్రీయాశీలక టీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ అయ్యారు, హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు అందరూ టీఆర్ఎస్ పార్టీలోనే వున్నారని ఆయన అన్నారు, తాను కానీ, ఈటెల కానీ లేక ఎవరైనా టీఆరఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ గుర్తుపైనే, కేసీఆర్ బోమ్మ పెట్టుకునే గెలిచారని ఆయన హుజూరాబాద్ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపే ప్రయత్నం చేశారు. క్యాడర్ చెదిరిపోకుండా చూసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ, గంగుల జరిపిన సమావేశం కాసింత బలాన్ని అందించింది.
కేసీఆర్ పనితీరుకు, ప్రభుత్వ పనితీరుకు రెపరెండంగా వరుస ఎన్నికల విజయాలే తార్కాణమన్నారు. ఎన్నికలేవైనా టీఆర్ఎస్నే ప్రజలు ఆదరిస్తున్నారని, కేసీఆర్ పోటోనే మా గెలుపు మంత్రమన్నారు. మెన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70శాతం తెలంగాణ ప్రజల విశ్వాసంతో ఘన మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని, అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇదే నిరూపితమయిందన్నారు. నాగార్జునసాగర్లో జానారెడ్డే గెలుస్తాడని అందరూ చెప్పినా... టీఆర్ఎస్ అభ్యర్థి కేవలం కేసీఆర్ పోటోతో భారీ మెజార్టీతో గెలిచిన విషయాన్ని గంగుల గుర్తుచేశారు.కేసీఆర్ వెంటే పార్టీ మెత్తం ఉందని, ఎన్నికలేవైనా కేసీఆర్ పోటోనే తమ గెలుపుమంత్రమన్నారు.
ప్రజలకు కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలే గెలుపు బాటలు వేస్తున్నాయని చెప్పారు, కల్లాల్లో పండుతున్న పంటల్లో, కాల్వల్లో పారుతున్న నీళ్లల్లో కేసీఆర్ ని ప్రజలు చూస్తున్నారని, కళ్యాణలక్ష్మీ, రైతు బందు, రైతు బీమల్లో కేసీఆర్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని పార్టే ముఖ్యమమని గంగుల అన్నారు. హుజురాబాద్లో ఈటెల వల్ల ఎలాంటి నష్టం లేదని, క్యాడర్లో ఎవరికీ అనుమానాలు లేవని, అందరూ పూర్తిగా దీమాతో ఉన్నారని అన్నారు. పార్టీ స్థానికంగా చాలా బలంగా ఉందని, ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.
హుజురాబాదులో పార్టీ క్యాడర్ కు అండగా ఉంటామని, వారికి నిరంతంర అంధుబాటులో ఉంటామని, భవిష్యత్లో పార్టీ తీసుకొనే నిర్ణయానికి పూర్తిగా అందరం కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు. ఈటెల వ్యవహారంలో పార్టీ త్వరలోనే అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, పుట్ట మదు వ్వవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని, హైకోర్టులో వామన్ రావు గారి తండ్రి పిర్యాదు మేరకు చట్టం తన పని తాను చేస్తుందని, జరుగుతున్న వ్యవహారాల్లో పార్టీకి ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని అన్నారు. ఎన్నికలేవైనా ఇంతలా ఆదరిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి మంత్రి గంగుల ధన్యవాదాలు తెలియజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more