తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతారని గత కొన్ని రోజులుగా వస్తున్న ప్రచారానికి ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం బలం చేకూర్చేలా వుంది. రెండు రోజుల ముందువరకు సాగిన హైదరాబాద్-మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన ఆయన.. తీరా అదివారం జరిగిన ఎన్నికలలో ఓటు హక్కును కూడా వినియోగించుకన్న ఆయన ఆ తరువాతి రోజునే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మూడు నెలల పాటు దూరంగా ఉంటానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. బీజేపిలో చేరడంలేదని ఆయన స్పష్టం చేశారు. 3నెలల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. అయినా కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపిలో చేరతారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు చేవెళ్ల టిక్కెట్ లభించడంతో ఆయన కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి లేఖ రాశారు.
స్వతహాగా సంపన్నుడు, విద్యావేత్త, పారిశ్రామిక వేత్త అయిన విశ్వేశ్వర్ రెడ్డి 2014లో రాజకీయ అరంగ్రేటం చేశారు. ఆయనను తమ పార్టీలోకి అహ్వానించిన టీఆర్ఎస్.. పార్టీ నుంచి చేవెళ్ల తరపున పార్లమెంటు బరిలోకి దింపింది. 2014 లోక్సభ ఎన్నికల్లో విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల స్థానం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి విజయంసాధించారు. ఆ తరువాత ఆయన అనూహ్యంగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరారు. 2019 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more