నందిగ్రామ్ లో నామినేషన్ దాఖలు చేసిన అక్కడి రేయపారలోని దేవాలయంలో దర్శనం చేసుకుని వెనుదిరుగి కారు ఎక్కుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అకస్మాత్తుగా నలుగురు వ్యక్తులు అమెను తోసివేసి బలంగా తలుపువేయడంతో అమె కాలికి తీవ్రగాయం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేయపారా నుంచి కొల్ కతాకు తరలించి.. అక్కడి ప్రభుత్వ ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఐదుగురు వైద్య నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం సేవలు అందిస్తోంది.
ఈ నేపథ్యంలో అమె ఆరోగ్య పరిస్థితిపై ఇవాళ అసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మమతా బెనర్జీ ఎడమ కాలు చీలమండ, పాదంలో తీవ్రమైన ఎముక గాయలు వున్నట్లు తెలిపారు. ఘటనలో బలంగా గాయపడిన అమె.. కుడి భుజం, మెడకు కూడా గాయాలైనట్లు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత నుంచి మమతా బెనర్జీ.. ఛాతీనొప్పి, శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటన్నారని.. అమె అరోగ్య పరిస్థితి నిలకడగా వున్న.. అమెకు 48 గంటల పాటు వైద్యలు పర్యవేక్షణలో వుండాలని వైద్యులు తమ హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. అమెకు మరిన్ని వైద్య పరీక్షలు చేయాల్సివుందని తెలిపారు.
మరోవైపు సీఎం మమతా బెనర్జీ కాలికి గాయం నేపథ్యంలో తమదైనశైలిలో విపక్షాలు అమెపై వ్యంగస్త్రాలను అన్ లైన్ వేదికగా సామాజిక మాద్యమాల్లో గుప్పిస్తోంది. మరీ ముఖ్యంగా బీజేపి సోషల్ మీడియా వేదికగా మమత గాయాన్ని తూలనాడుతోంది. దీంతో తృణముల్ కాంగ్రెస్ కూడా అదే స్తాయిలో ధీటుగా బదులిస్తోంది. దీదీపై కుట్రపూరితంగానే బీజేపి దాడి చేసిందని తృణముల్ కాంగ్రెస్ అరోపించగా, దానిని బీజేపి వర్గాలు ఖండించాయి. మమతపై ఎలాంటి దాడి జరగలేదు అని, అదంతా నాలకమని దుయ్యబట్టింది. అంతటితో అగకుండా చిన్నగాయాన్ని మమతా బెనర్జి.. తృణముల్ కాంగ్రెస్ నేతలు పెద్దది చేసి చూపిస్తూ నాటకాన్ని మరింత రక్తికట్టిస్తున్నారని అరోపించింది.
అయితే బీజేపి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్లమెంటరీ సభ్యుడు అభిషేక్ బెనర్జి.. బీజేపికి గట్టి హెచ్చరికలు చేశారు. తగిలింది పెద్ద గాయమని, 48 గంటల పర్యవేక్షణ అవసరమని వైద్యులు చెబుతుంటే.. తగలింది చిన్న గాయమని బీజేపి నేతలు ఎలా చెబతున్నారని ఆయన ప్రశ్నించారు. అంటే బీజేపి నేతలే దిదిపై దొంగ దెబ్బ తీసేందుకు వెనకనుంచి దాడికి పాల్పడ్డారా అని ఆయన ప్రశ్నించారు. బెంగాల్ ప్రజల తమ దీదీగా చేసుకన్న మమతపై మీరు దొంగదెబ్బ తీస్తే.. దాని ప్రతిఫలమేంటు మే 2వ తేదీన బెంగాల్ ప్రజలు చూపుతారని.. దాన్ని చూసేందుకు సిద్ధంగా ఉండాలని బీజేపికి సవాల్ విసిరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more