ఓ వైపు దేశంలో పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరుగుతూ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి గరిష్టాన్ని నమోదు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇంధన ధరలపై వ్యవసాయ సెస్సు కూడా విధించనున్నట్టు కేంద్ర ప్రకటించింది. అదేమిటోగానీ.. ఓ వైపు యూరియా ధరలపై మీద సబ్సీడీని కూడా తగ్గించుకుంటూ.. మరో వైపు పంట రుణాలకు ఇచ్చే మొత్తాన్ని కూడా బడ్జెట్ లో అరకోర నిధులు కేటాయించిన కేంద్ర.. ప్రజలను మాత్రం నిత్యం వాయిస్తూనే.. వారి జేబులకు చిల్లు పెడుతోంది.
కరోనా ప్రభావంతో దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ప్రజల నుంచి డబ్బును అడ్డదిడ్డంగా లాగితే.. మరీ కరోనా కష్టంలో చిక్కకుని కుదైలైన సామాన్యుడు.. ప్రభుత్వం పెంచుతూ పోతున్న ధరలను ఎలా భరించాలన్న విషయం కూడా ప్రభుత్వాలే సెలవిస్తే మంచిది. ఇంధన ధరలతో పాటు అటు గ్యాస్ ధరలు కూడా పెరగుతుండటం.. వీటి ప్రభావం నిత్యావసర సరుకులపైబడి.. వాటి ధరలకు కూడా అకాశాన్ని అంటుతుండటంతో.. సామాన్యులు దిక్కుతోచని స్థితిలోకి జారుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఓ కొత్త జంటకు పెరుగుతున్న ధరలపై అవగాహన కల్పించేందుకు వరుడి స్నేహితులు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అదెలా అంటారా.. కొత్త జంటకు వరుడి స్నేహితులు పెట్రోల్, గ్యాస్ సిలిండర్, ఉల్లిదండలు ఇచ్చి.. వారు విస్తుపోయేలా చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. చెన్నైలోని వంగరం ప్రాంతంలో జరిగిన కార్తీక్, శరణ్యల వివాహ విందు కార్యక్రమం స్థానిక కల్యాణ మండపంలో ఘనంగా జరిగింది. పెళ్లి రిసెఫ్షన్ కు వచ్చిన వరుడి స్నేహితులు ఐదు లీటర్ల పెట్రోలు, గ్యాస్ బండను కొత్త జంటకు బహుమతిగా ఇచ్చారు. అలాగే, ఉల్లిపాయలతో చేసిన దండను వారి మెడలో వేశారు.
ఇటీవల పెళ్లిళ్లలో తరచూ ఇలాంటి వినూత్న బహుమతులు ఇవ్వడం జరుగుతోంది. విన్నూత కానుకలతో తమ స్నేహితుల పెళ్లి వైరల్ కావాలని, వరుడిస్నేహితులు కూడా విభిన్నంగా అలోచించి.. వినూత్న కానుకలను అందించారు. దీంతో కార్తీక్, శరణ్యల వివాహం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే పెళ్లి కాదండీ.. పెళ్లిలో వరుడి స్నేహితులు ఇచ్చిన విన్నూత కానుకలే ఈ పెళ్లి వీడియోను చర్చనీయాంశంగా చేశాయి. అంతేకాదు ఈ వీడియో కూడా ప్ర్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోలు, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటి వాడైన తమ స్నేహితుడికి మిత్రులు ఇలా పెట్రోలు, గ్యాస్ సిలిండర్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more