కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ బిల్లులను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని దేశరాజధాని సింఘు, టిక్రీ శివార్లో రైతులు చేస్తున్న నిరసన దీక్షలను తక్షణం నిలిపేసి.. తమతో చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇవాళ మరోమారు అన్నదాతలను అభ్యర్థించారు, రక్తం గడ్డకట్టే చలిలో రతన్నలు దీక్షలు చేయడం మంచిదికాదని, వారి కోసం కేంద్రం తీసుకువచ్చిన ప్రతిపాదనలను రైతు సంఘాలు పరిశీలించాలని కోరారు. రైతు సంఘాల అందోళనలతో రాజధానికి చెందిన సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, వారి అవసరాల దృష్ట్యా రైతులు నిరసనలను విరమించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అహంకార పూరిత చర్యలకు వెళ్లడం లేదని, పైగా రైతులతో చర్చలకు సిద్దమని ప్రకటిస్తుందని, ఈ తరుణంలోనూ రైతు సంఘాలు చర్చలకు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. చర్చల తరువాత చట్టాల్లో సవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టంగా చెబుతున్నామన్నారు. చట్టాల్లో అభ్యంతరాలు వుంటే దానికి వారినే పరిష్కారాలు ఇవ్వాల్సిందా కూడా కోరామని అయినా రైతులు ముందుకు రాకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులు తమ అందోళనలను విరమించుకుని వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపాలని.. వారితో చర్చలకు ప్రభుత్వం సిద్దంగా వుందని తోమర్ తెలిపారు.
దేశ రైతన్న తనకు అన్యాయం జరుగుతుందని గ్రహించి అందోళన చేపట్టినా.. తమ పంతం నెగ్గాలనే కేంద్రం యోచిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు, ఇవాళ మరోమారు కేంద్రప్రభుత్వంపై దాడి చేసిన ఆయన కేంద్ర సర్కార్, దేశంలోని రైతుల అధాయం బీహార్ లో సగటు రైతు సంపాదనకు ఎక్కువ కాకుండా వుండాలని కోరుకుంటోందని అరోపించారు. దేశంలోని సగటు రైతు ఆదాయంపై ఓ మీడియా సంస్థ చేసిన సర్వేను ఈ సందర్భంగా ఊటంకిస్తూ రైతు సంపన్నుడైతే ఇతరాత్ర వ్యవహారాలపై దృష్టి సారిస్తాడని, అందులో ముఖ్యంగా రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాడని ఇది తమ ప్రభుత్వానికి సముచితం కాదని బీజేపి భావిస్తుందని అరోపించాడు.
దేశంలోని ప్రతీ రైతు తమ సగటు ఆదాయం పంజాబ్ రైతుల ఆదాయంతో సమానంగా వుండాలని కోరుకుంటాడని, అయితే అందుకు భిన్నంగా మోడీ ప్రభుత్వం మాత్రం రైతులందరీ ఆదాయం బీహార్ రైతుల ఆదాయంతో సమానాంగా ఉండాలని కోరుటుందోని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు, అయితే మీడియా వెలువరించిన నివేదిక ప్రకారం.. దేశంలోని సగటు రైతు వార్షికాదాయం రూ.77,124 గా ఉంది. కాగా, పంజాబ్ రైతులు సాలీనా రూ. 2, 16, 708 సంపాదిస్తుండగా, బీహార్ రైతులు మాత్రం ఏడాది కేవలం 42, 684 రూపాయలను ఆర్జిస్తున్నారని స్పష్టం చేసింది. ఈ నివేదిక వెలువడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ దానిని ఉటంకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
ఇక రైతుల నిరసనలపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోరారు. కేంద్రం అమల్లోకి తీసుకువస్తున్న నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో నిరసన దీక్షలపై సకాలంలో స్పందించని పక్షంలో అవి దేశరాజధాని ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించే అవవకాశాలు వున్నాయని అన్నారు, వ్యవసాయ బిల్లులపై సకాలంలో నిర్ణయం తీసుకోని పక్షంటో అవి కేంద్రంలోని ప్రభుత్వానికి చేటు చేస్తుందని హితువు పలికారు. దీనిపై కేంద్రం సానుకూల పరిష్కారం ఇవ్వకపోతే ఈ ప్రతిష్టంభన మరిన్ని రోజులు కొనసాగే అవకాశముందన్నారు. ఇక నిరసనకు దిగిన రైతుల సహనాన్ని పరీక్షించడం కూడా మంచిదికాదని అన్నారు. పార్లమెంటులో ఈ బిల్లులపై హాడావిడి రీతిలో చర్చ జరిగిందని, విపక్షాలకు అవకాశం కూడా ఇవ్వకుండా బిల్లులను కేంద్రం అమోదించుకున్న ప్రతిఫలమే రైతుల అందోళనని పవార్ విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more