గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ తొలిరౌండ్ కోనసాగుతోంది. ఈ ఫలితాలలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి-బీజేపికి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీపై రమారమవి శతాధిక స్థానాల్లో బీజేపి గట్టిపోటీని ఇస్తోంది. ఇదిలావుండగా 70 స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అధిక్యం సంపాదించుకోగా, బీజేపి మాత్రం ముఫై ఐదు స్థానాల్లో అధిక్యాన్ని కోనసాగిస్తోంది. ఇక ఇదే సమయంలో ఎంఐఎం పార్టీ కూడా మొత్తంగా 41 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం నాలుగు స్థానాల్లో అధిక్యంలో వుంది, నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో బీజేపి తన అధిపత్యాన్ని ప్రదర్శింస్తోంది.
కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం రామచంద్రాపురం, యూసుఫ్ గూడ, మెట్టుగూడ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని అందుకుంది, జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి అందించింది మాత్రం యూసుఫ్ గూడ ఓటరే. ఈ డివిజన్ నుంచి అధికార పార్టీ తరపున బరిలో దిగిన బండారి రాజ్ కుమార్ పటేల్ ప్రత్యర్థి బీజేపి అభ్యర్థిపై విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ తరుపు విజయాన్ని అందించారు. ఇక రామచంద్రాపురం డివిజన్ నుంచి అధికార పార్టీ తరుపున బరిలో దిగిన పుష్పానాగేష్ యాదవ్ కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు.
రామచంద్రాపురం ఎన్నికలలో పుష్పానాగేష్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి బీజేపి అభ్యర్థి ఎం నర్సింగ్ గౌడ్ పై దాదాపు 5700 పైచిలుకు ఓట్లతో విజయాన్ని అందుకున్నారు, ఇక మెట్టుగూడలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాసూరి సునిత విజయాన్ని అందుకున్నారు. ఇక అధికార పార్టీ చందానగర్, పటాన్ చెరువు, హఫీజ్ పేట్, హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పాత బోయిన్ పల్లి, బాలానగర్, కాప్రా, మీర్ పేట్, శేరిలింగంపల్లి, రంగారెడ్డి నగర్ వార్డుల్లో దూసుకెళ్తోంది. ఇక గచ్చిబౌలి, కొండాపూర్ సహా అనేక వార్డులలో బీజేపి అధికార పార్టీకి గట్టిపోటీనిస్తోంది. అటు ఓల్డ్ సిటీలో మెహదీపట్నం డివిజన్ తరువాత ఏకంగా 14 స్థానాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more