గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ తొలిరౌండ్ కోనసాగుతోంది. ఈ ఫలితాలలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి-బీజేపికి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీపై రమారమవి శతాధిక స్థానాల్లో బీజేపి గట్టిపోటీని ఇస్తోంది. ఇదిలావుండగా 70 స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అధిక్యం సంపాదించుకోగా, బీజేపి మాత్రం ముఫై ఐదు స్థానాల్లో అధిక్యాన్ని కోనసాగిస్తోంది. ఇక ఇదే సమయంలో ఎంఐఎం పార్టీ కూడా మొత్తంగా 41 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం నాలుగు స్థానాల్లో అధిక్యంలో వుంది, నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో బీజేపి తన అధిపత్యాన్ని ప్రదర్శింస్తోంది.
కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం రామచంద్రాపురం, యూసుఫ్ గూడ, మెట్టుగూడ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాన్ని అందుకుంది, జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి అందించింది మాత్రం యూసుఫ్ గూడ ఓటరే. ఈ డివిజన్ నుంచి అధికార పార్టీ తరపున బరిలో దిగిన బండారి రాజ్ కుమార్ పటేల్ ప్రత్యర్థి బీజేపి అభ్యర్థిపై విజయం సాధించారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ తరుపు విజయాన్ని అందించారు. ఇక రామచంద్రాపురం డివిజన్ నుంచి అధికార పార్టీ తరుపున బరిలో దిగిన పుష్పానాగేష్ యాదవ్ కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు.
రామచంద్రాపురం ఎన్నికలలో పుష్పానాగేష్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి బీజేపి అభ్యర్థి ఎం నర్సింగ్ గౌడ్ పై దాదాపు 5700 పైచిలుకు ఓట్లతో విజయాన్ని అందుకున్నారు, ఇక మెట్టుగూడలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాసూరి సునిత విజయాన్ని అందుకున్నారు. ఇక అధికార పార్టీ చందానగర్, పటాన్ చెరువు, హఫీజ్ పేట్, హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పాత బోయిన్ పల్లి, బాలానగర్, కాప్రా, మీర్ పేట్, శేరిలింగంపల్లి, రంగారెడ్డి నగర్ వార్డుల్లో దూసుకెళ్తోంది. ఇక గచ్చిబౌలి, కొండాపూర్ సహా అనేక వార్డులలో బీజేపి అధికార పార్టీకి గట్టిపోటీనిస్తోంది. అటు ఓల్డ్ సిటీలో మెహదీపట్నం డివిజన్ తరువాత ఏకంగా 14 స్థానాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more