GHMC elections: BJP leads in postal votes జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: పోస్టల్ బ్యాలెట్ లో బీజేపికే మొగ్గు

Ghmc election results trs faces still competition from bjp mim wins mehdipatnam

ghmc polls, ghmc elections 2020, ghmc elections 2020, ghmc elections results, ghmc election results, ghmc election results 2020, ghmc election results live, hyderabad election, hyderabad election results, hyderabad election results 2020, hyderabad municipal election results, hyderabad municipal election results 2020, hyderabad ghmc election results 2020, hyderabad municipal corporation election results 2020, ghmc polls results, ghmc polls results 2020, ghmc civic polls, ghmc civic polls results, ghmc civic polls results 2020, Telangana, Politics

TRS maintains lead in the first round of GHMC results. The TRS dominance in Arsipuram, Patancheru, Chandanagar, Hafizpet, Hyderabad, Jubilee Hills, Khairatabad, Oldboinpalli, Balanagar, Charlapally, Capra, Mirpet-HB Colony, Sherilingampally and Rangareddy Nagar.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు: తొలిరౌండ్ టీఆర్ఎస్ ఆధిక్యం.. మెహదీపట్నంలో భోణికొట్టిన ఎంఐఎం..

Posted: 12/04/2020 02:11 PM IST
Ghmc election results trs faces still competition from bjp mim wins mehdipatnam

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ తొలిరౌండ్ కోనసాగుతోంది. ఈ ఫలితాలలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి-బీజేపికి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. ఇప్పటికీ బీజేపి పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీపై 70 స్థానాల్లో అధిక్యం సంపాదించుకోగా, టీఆర్ఎస్ మాత్రం ముఫై ఐదు స్థానాల్లో అధిక్యాన్ని కోనసాగిస్తోంది. ఇక ఇదే సమయంలో ఎంఐఎం పార్టీ కూడా మొత్తంగా 21 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు స్థానాల్లో అధిక్యంలో వుంది, నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో బీజేపి తన అధిపత్యాన్ని ప్రదర్శింస్తోంది.

కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం రామచంద్రాపురం, చందానగర్, పటాన్ చెరువు, హఫీజ్ పేట్, హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పాత బోయిన్ పల్లి, బాలానగర్, కాప్రా, మీర్ పేట్, శేరిలింగంపల్లి, రంగారెడ్డి నగర్ వార్డుల్లో దూసుకెళ్తోంది. ఇక గచ్చిబౌలి, మాదాపూర్ సహా అనేక వార్డులలో బీజేపి అధికార పార్టీకి గట్టిపోటీనిస్తోంది. అయితే అది నుంచే ఈ రెండు పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా వున్న పోటీ.. రౌండ్లు పూర్తవుతున్న కోద్ది మరింత జఠిలంగా మారవచ్చునని.. దీంతో బల్దియా పీఠంపై ఎవరు అధిపత్యం కోనసాగుతుందన్న ఉత్కంఠ మాత్రం ఇప్పటికీ పార్టీల మధ్య కొనసాగుతోంది.

తొలి ఫలితం వచ్చేసింది.. మోహదీపట్నంలో బోణికొట్టిన ఎంఐఎం

 

మెహదీపట్నం డివిజన్ ఫలితం ముందస్తుగా విడుదల అవుతుందని వచ్చిన అంచనాల నేపథ్యం కరెక్టయ్యింది. ముందుగా ఈ డివిజన్ పూర్తి ఫలితం వెలువడింది. ఈ డివిజన్ లో మజ్లిస్ పార్టీ తన విజయాన్ని నమోదు చేసుకుని జీహెచ్ఎంసీ ఎన్నికలలో బోణి కోట్టింది. ఇక్కడి నుంచి ఎంఐఎం పార్టీ తరపున బరిలో నిలిచిన మహమ్మద్ మజీద్ హుస్సేన్ మరోమారు విజయాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీలో డిఫ్యూటీ మేయర్ గా సేవలు అందిస్తున్న ఆయన మరోమరు తన సమీప ప్రత్యర్ధి బీజేపి అభ్యర్థి డి.గోపాల్ కృష్ణపై విజయం సాధించారు, ఇక మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య గ్రేటర్ ఫీఠంపై పూర్తి అంచనాలు వెలువడనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles