గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ తొలిరౌండ్ కోనసాగుతోంది. ఈ ఫలితాలలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి-బీజేపికి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. ఇప్పటికీ బీజేపి పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీపై 70 స్థానాల్లో అధిక్యం సంపాదించుకోగా, టీఆర్ఎస్ మాత్రం ముఫై ఐదు స్థానాల్లో అధిక్యాన్ని కోనసాగిస్తోంది. ఇక ఇదే సమయంలో ఎంఐఎం పార్టీ కూడా మొత్తంగా 21 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు స్థానాల్లో అధిక్యంలో వుంది, నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో బీజేపి తన అధిపత్యాన్ని ప్రదర్శింస్తోంది.
కాగా అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం రామచంద్రాపురం, చందానగర్, పటాన్ చెరువు, హఫీజ్ పేట్, హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పాత బోయిన్ పల్లి, బాలానగర్, కాప్రా, మీర్ పేట్, శేరిలింగంపల్లి, రంగారెడ్డి నగర్ వార్డుల్లో దూసుకెళ్తోంది. ఇక గచ్చిబౌలి, మాదాపూర్ సహా అనేక వార్డులలో బీజేపి అధికార పార్టీకి గట్టిపోటీనిస్తోంది. అయితే అది నుంచే ఈ రెండు పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా వున్న పోటీ.. రౌండ్లు పూర్తవుతున్న కోద్ది మరింత జఠిలంగా మారవచ్చునని.. దీంతో బల్దియా పీఠంపై ఎవరు అధిపత్యం కోనసాగుతుందన్న ఉత్కంఠ మాత్రం ఇప్పటికీ పార్టీల మధ్య కొనసాగుతోంది.
మెహదీపట్నం డివిజన్ ఫలితం ముందస్తుగా విడుదల అవుతుందని వచ్చిన అంచనాల నేపథ్యం కరెక్టయ్యింది. ముందుగా ఈ డివిజన్ పూర్తి ఫలితం వెలువడింది. ఈ డివిజన్ లో మజ్లిస్ పార్టీ తన విజయాన్ని నమోదు చేసుకుని జీహెచ్ఎంసీ ఎన్నికలలో బోణి కోట్టింది. ఇక్కడి నుంచి ఎంఐఎం పార్టీ తరపున బరిలో నిలిచిన మహమ్మద్ మజీద్ హుస్సేన్ మరోమారు విజయాన్ని కైవసం చేసుకున్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీలో డిఫ్యూటీ మేయర్ గా సేవలు అందిస్తున్న ఆయన మరోమరు తన సమీప ప్రత్యర్ధి బీజేపి అభ్యర్థి డి.గోపాల్ కృష్ణపై విజయం సాధించారు, ఇక మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య గ్రేటర్ ఫీఠంపై పూర్తి అంచనాలు వెలువడనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more