కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో గిరాకీ లేక వ్యాపారాలన్నీ దివాళా దిశగానే సాగుతున్నాయి. ఈ సమయంలోనే కార్తీక మాసంలో జరిగే వివాహాలతోనైనా కాసింత ఉపశమనం లభిస్తుందని బంగారం వర్తకులు ఆశగా దుకాణాలు తెరిచి వ్యాపారాలు చేస్తుండగా, బరితెగించిన దొంగలు తమ బతుకుదెరువు కోసం వ్యాపారులనే టార్గెట్ గా చేసి నిట్టనిలువునా దోచుకోవడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు లో ఇలాంటి ఘటనే జరిగింది. పోలీసులమని నమ్మబలికిన పలువురు గుర్తుతెలియని వ్యక్తులు బంగారు వ్యాపారికి కుచ్చుటోపీ పెట్టారు. ఏకంగా కిలో బంగారు బిస్కెట్లు ఆయన నుంచి లాక్కుని ఉడాయించారు.
ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం రేపింది. విషయం ఒంగోలు వర్తక సంఘం ద్వారా పోలీసులకు చేరింది. అయితే తాము ఎవరినీ తనిఖీ చేయలేదని, మరెవరి నుంచి బంగారం స్వాధీనం చేసుకోలేదని తెలిపిన పోలీసులు అసలు ఏం జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వ్యాపారి ఒకరు ఆభరణాలు తయారీ కోసం చెన్నై నుంచి కిలో బంగారు బిస్కెట్లు తీసుకుని జగ్గయ్యపేటకు బయలుదేరాడు. నెల్లూరు వరకు ఓ వాహనంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ బయలుదేరాడు. నెల్లూరు నుంచి బయల్ధేరిన బస్సు ఒంగోలు బస్టాండుకు చేరుకున్న తరుణంలో.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తాము ఐడీ పార్టీ పోలీసులమని బస్సెక్కారు.
వ్యాపారిని తనిఖీ చేయాలని చెప్పి కిందికి దింపిన.. ఆయన వద్ద ఉన్న బంగారు బిస్కెట్లను తీసుకున్నారు. కొంత సమయం అయనను ప్రశ్నలపై ప్రశ్నలు సంధించిన అగంతకులు ఆ తరువాత క్షణాల్లో పరారయ్యారు. పోలీసులని చెప్పిన వ్యక్తులు తన బంగారాన్ని తీసుకుని వెళ్లడంతో విస్తుపోయిన వ్యాపారి నిర్ఘాంథపోయాడు. షాక్ నుంచి తేరుకున్న ఆయన జగయ్యపేటలోని తన వ్యాపారులకు సమాచారం అందించాడు. వారి సహకారంలో ఒంగోలులోని వర్తక సంఘానికి విషయం చేరింది. దీంతో వారు పోలీసులను అశ్రయించారు. ఐతే తాము ఎవరినీ తనిఖీ చేయలేదన్న పోలీసుల సమాధానంలో వ్యాపారి కన్నీళ్లపర్యంతమయ్యాడు, కాగా కేసును సవాల్ గా తీసుకున్నామని త్వరలోనే నిందితులను పట్టకుంటామని డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ వర్తక సంఘానికి హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more