(Image source from: Outlookindia.com)
బొగ్గు గనుల కేటాయింపు కేసులో పదకొండేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత ఢిల్లీ రౌస్ అవెన్యూలోని ప్రత్యేక సీబిఐ న్యాయస్థానం ఇవాళ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. బొగ్గు గనుల అక్రమ కేటాయింపుల్లో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు సీబిఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో పాటు దోషులందరికీ రూ. 10లక్షల జరిమాను కూడా విధించింది. ఈ కేసులో అక్రమాలకు పాల్పడిన మరో ఇద్దరు దోషులకు కూడా అదే శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో అక్టోబర్ 6నే తీర్పును వెలువరించిన కేంద్ర మాజీ మంత్రితో పాటుగా మరో ముగ్గురిని కూడా దోషులుగా తేల్చిన న్యాయస్థానం ఇవాళ ఈ నలుగురికీ శిక్షలను ఖరారు చేసింది. మూడేళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది.
అయితే ఇలా శిక్షలు ఖరారైన మరోకిద్ది సేపట్లో దోషులకు అదే న్యాయస్థానం బెయిలును కూడా మంజూరు చేసింది. దోషులుగా తేలిన నలుగురికి లక్ష రూపాయల బాండ్ పూచికత్తుతో న్యాయస్థానం బెయిలు మంజూరు చేసింది. తమ తీర్పుపై దోషులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు కూడా నవంబర్ 25 వరకు గడవును ఇచ్చింది. 1999లో అటల్ బిహారీ వాజ్పేయీ హయాంలో దిలీప్ రే బొగ్గు గనులశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. జార్ఖండ్లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడిన దిలీప్ రేతో పాటు అప్పట్లో ఆ శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్, క్యాస్ట్రన్ టెక్ లిమిటెడ్ డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాల్ ను దోషిగా తేల్చింది.
ఇవాళ దోషులందరికీ శిక్షను ఖరారు చేసిన న్యాయస్థానం.. రూ. లక్ష పూచికత్తుతో బెయిలు మంజూరు చేసింది. కాగా అక్రమ కేటాయింపులతో లాభాన్ని పోందిన క్యాస్ట్రన్ టెక్కు రూ.60లక్షలు, క్యాస్ట్రన్ మైనింగ్ లిమిటెడ్కు మరో రూ.10 లక్షల అదనపు జరిమానా వేసింది. ఇక ఇదే బోగ్గు గనుల అక్రమ కేటాయింపులకు పాల్పడిన కేసులో ఇప్పటికే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు రూ.25 లక్షల అపరాధ రుసుము విధించిన న్యాయస్థానం ఆయనకు కూడా మూడేళ్ల జైలు శిక్షను విధించింది. ఇక మధుకోడాతో పాటు కేంద్ర బొగ్గు గనుల కార్యదర్శిగా వ్యవహరించిన హెచ్ సి గుప్తాకు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more