వైద్య కళాశాలల్లో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు 50శాతం కోటా కింద సీట్ల కేటాయింపును ఈ వార్షిక సంవత్సరంలోనే కల్పించాలన్న అభ్యర్థనను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో నీట్ ద్వారా భర్తీచేసే అఖిల భారత కోటా సీట్లలో యాభై శాతం ఓబీసీలకు కేటాయించాలని తమిళనాడు అధికార పార్టీ ఎఐఏడిఎంకే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే పార్టీలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటీషన్లతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టును ఆశ్రయించాయి, ఈ పిటీషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం వారి అభ్యర్థనను తోసిపుచ్చింది.
వైద్య కళాశాలల్లోని పోస్టు గ్రాడ్యూయేట్, ఎంబిబిఎస్, డెంటల్ కోర్సులకు చెందిన సీట్లలో 50శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతో ఈ రెండు పార్టీలూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ పిటీషన్లను జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రాస్తోగిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అయితే, విద్యార్థులు జనవరి - ఫిబ్రవరి మాసాల్లో దరఖాస్తులు నింపినందున వారికి ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలను విస్తరించడం ఈ ఏడాది సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది. జులై నెలలో ఇదే విషయమై దాఖలైన పిటీషన్లను మద్రాసు హైకోర్టు కూడా విచారించింది.
కేంద్ర నిర్వహణలో లేని విద్యా సంస్థల్లో ఆల్ ఇండియా కోటా కింద వెనకబడిన తరుగతులకు చెందిన విద్యార్థులకు 50శాతం రిజర్వేషన్ల పరిశీలనకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, తమిళనాడు ఆరోగ్యశాఖ, అఖిలభారత వైద్య మండలితో కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే. మూడు నెలల్లో కమిటీ నియమించి రిజర్వేషన్లు కల్పించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. కాగా కమిటీ వెలువరించే నిర్ణయాలు వచ్చే సంవత్సరం నుంచి అమలు చేయాలని ఆదేశించింది. అయితే, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ విద్యా సంవత్సరంలోనే 50శాతం కోటా అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయా పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more