అక్రమ మార్గాల ద్వారా తమ టీవీ వీక్షకుల సంఖ్యను పెంచుకుని టీఆర్పీ రేటింగ్ లపై ప్రభావితం చేసిన టీవీ ఛానెల్ల గుట్టును బయటపడటం కేవలం అరంభం మాత్రమేనని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు, టీఆర్పీ రేటింగ్ కోసం పలు ఛానెళ్లు మోసాలకు పాల్పడ్డాయని.. తమ టీవీ చానెళ్లలో వ్యాపార ప్రకటనలను భారీగా పెంచుకోవడంతో పాటు టారిఫ్ రేట్లు కూడా భారీగా వడ్డించేందుకు అక్రమ మార్గాలలో పయనించాయని ముంబై పోలీసులు వెలికితీసిన విషయపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణంలో జాతీయ ఆంగ్ల ఛానెల్ రిపబ్లిక్ టివీతో పాటు మరో రెండు మరాఠి చానెళ్లు కూడా వున్నాయని అన్నారు,
వార్తలను అందిస్తూ, డిబేట్ లను యావత్ దేశ ప్రజలు చూస్తున్నారని.. ప్రతీ అంశాన్ని దేశం తెలుసుకోవాలని భావిస్తుందని.. ప్రశ్నించే న్యూస్ ఛానెల్ సహా మరాఠీ చానెళ్లు అక్రమ మార్గాల్లో తమ టీఆర్పీ రేటింగ్ లను పెంచుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన నిలదీశారు. అడ్డదారిలో అందలం ఎక్కాలని, వాణిజ్య ప్రకటనదారులను మోసం చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని కూడా దేశం తెలుసుకోవాలని భావిస్తోందని ప్రశ్నించారు, రూ.30 వేల కోట్ల విలువైన భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో ముంబయి పోలీసుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు.
ముంబై పోలీసులు ఎంతో సాహసోపేతంగా వ్యవహరించారని, అయితే, ఈ వ్యవహారంలో ముంబయి పోలీసులు కక్షసాధింపు, ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సరికాదని హితవు పలికారు. ముంబయి పోలీసుల ప్రొఫెషనలిజాన్ని ఎవరూ ప్రశ్నించలేరని అన్నారు. మహావికాస్ అగాఢీ సర్కారును అస్థిరపరిచేందుకు, ఉద్ధవ్ థాకరే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని చానళ్లు వ్యవహరించిన తీరు ప్రతీకార ధోరణి కాదా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. టీఆర్పీ రేటింగ్ కుంభకోణం ఆరంభం మాత్రమేనని, మరికొన్నిరోజుల్లో ప్రభుత్వాన్ని కూల్చేందకు చేసే ప్రయత్నాలన్నీ కూడా మొత్తంగా బయటికి వస్తాయని రౌత్ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more