(Image source from: Twitter.com/RailMinIndia)
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం మరికొన్ని రైళ్ల సేవలను పునరుద్దరించిన తరువాత ఆన్ లాక్ 4.0 నుంచి దేశవ్యాప్తంగా 80 ప్రత్యేక రైళ్లును ప్రారంభించిన విషయం తెలిసిందే. కేవలం మూడు రోజుల క్రిందటే ఈ రైళ్లు ప్రారంభమైనప్పటికీ ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. సెప్టెంబర్ 10 నుంచి రిజర్వేషన్ కూడా ప్రారంభం కాగా, సెప్టెంబర్ 12 నుంచి సేవలు అందిస్తున్నాయి. కాగా అప్పటికీ నడుస్తున్న 230 రైళ్లకు అదనంగా ఈ 80 ప్రత్యేక రైళ్లు నడుస్తుండగా, ప్రస్తుతం మరో 40 కొత్త రైళ్లు కూడా సేవలు అందించనున్నాయి. ఈ మేరకు తాజాగా భారతీయ రైల్వే ప్రకటించింది.
దీంతో భారతీయ రైల్వే నడుపుతున్న రైళ్ల సంఖ్య 350 కి చేరుకోనుంది. మే 12 నుంచి అందుబాటులోకి వచ్చిన 30 ప్రత్యేక రాజధాని రైళ్ల తరువాత, అన్ లాక్ 1.0 నేపథ్యంలో జూన్ 1 నుంచి 200 మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి దేశంలోని వివిధ నగరాల నుంచి దేశరాజధాని నడుస్తున్నాయి. వీటి తరువాత ఇటీవల సెప్టెంబర్ 12 నుంచి 80 స్పెషల్ రైళ్లు కూడా వివిధ నగరాలకు సేవలను అందిస్తుండగా, తాజాగా మరో 40 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. తాజాగా అందుబాటులోకి రానున్న 40 ప్రత్యేక రైల్లు ఈ నెల 21 నుంచి సేవలను అందించనున్నాయి.
ఇటీవల అందుబాటులోకి వచ్చిన 80 ప్రత్యేక రైళ్ల మార్గాల్లో ఏదేని రైలుకు విపరీతమైన డిమాండ్ వుంటే ఆ స్థానంలో క్లోన్ రైళ్లను ప్రత్యేకంగా ప్రవేశపెడతామని ఇటీవల ప్రకటించిన రైల్వే.. తాజాగా వాటిని 21 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో ఆయా మార్గాల్లో వున్న ప్రయాణికుల డిమాండ్ అందుకునేందుకు ఈ క్లోన్ రైళ్లు దోహదపడనున్నాయి. కాగా క్లోన్ రైళ్లు అన్ని రిజర్వుడ్ రైళ్లని.. వీటిలో ప్రయాణించేందుకు ప్యాసింజర్లు ముందస్తుగా టిక్కెట్లు కొనుగోలు చేసుకోవాలని తెలిపింది. ఈ రైళ్లకు 10 రోజుల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ రైళ్లు కూడా లిమిటెడ్ స్టాపుల్లోనే ఆగనుంది.
* రైలు నెంబర్ 02787- సికింద్రాబాద్ నుంచి దానాపూర్ - ఉదయం 7.30 గంటలకు
* రైలు నెంబర్ 02788 - దానాపూర్ నుంచి సికింద్రాబాద్ - ఉదయం 9.00 గంటలకు
* రైలు నెంబర్ 06509 - బెంగళూరు నుంచి దానాపూర్ - ఉదయం 8 గంటలకు
* రైలు నెంబర్ 06510 - దానాపూర్ నుంచి బెంగళూరు - సాయంత్రం 6.10 గంటలకు
ఈ రైళ్లు విజయవాడ, వరంగల్ నగర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more