(Image source from: Twitter.com/ANI)
కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రతీ ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో జరగాల్సిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్, ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షలు ఈ సారి ఎప్పుడు జరగుతాయన్న విషయమై తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన బీజేపియేతర ముఖ్యమంత్రులతో విపక్షా నేత సోనియాగాంధీ సమావేశమై నీట్, జేఈఈలపై ఏం చేద్దామని చర్చించిన తరువాత ఇవాళ ఏకంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఏకంగా ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేసి మరీ నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. కాగా తాజాగా ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
జేఈఈ, నీట్ పరీక్షలను తప్పక షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని, కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి తోసివేయలేమని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ‘జీవిత ప్రయాణాన్ని ఆపలేం. భద్రతాపరమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. విద్యార్థులు సంవత్సర కాలన్ని వృథా కానివ్వోద్దు అని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మరోమారు కీలక ప్రకటన చేశారు. నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
జేఈఈ పరీక్షలకు సంబంధించి మొత్తం 8.58 లక్షల అడ్మిట్ కార్డులకు గానూ 7.5 లక్షల అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్నట్లు ఎన్టీఏ డీజీ తనతో చెప్పారని విద్యా శాఖ మంత్రి వెల్లడించారు. నీట్ పరీక్షకు సంబంధించి మొత్తం 15.97 లక్షల అడ్మిట్ కార్డులకు గాను... 10 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సుముఖంగా ఉన్నారనే విషయం దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. కరోనా నేపథ్యంలో జేఈఈ పరీక్షా కేంద్రాలను 570 నుంచి 660కి పెంచామని... అదేవిధంగా నీట్ కేంద్రాలను 2,546 నుంచి 3,842కి పెంచామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more