(Image source from: Twitter.com/ANI)
జమ్ముకశ్మీర్ లో ఒక ఉగ్రవాదిని భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి, అక్రమంగా భారత భూభాగంలోకి చోచ్చుకోచ్చి కాల్పులకు తెగబడిన ఇద్దరు సీఆర్పీఎఫ్, ఒక జమ్మూకాశ్మీర్ పోలీసు మరణానికి కారణమై ఉగ్రవాదులను వెంబడించిన భారత బద్రతా బలగాలు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఉగ్రవాదిని భారత బలగాలు హతమార్చాయి, ఈ ఎన్ కౌంటర్ జమ్మూకాశ్మీర్ లోని ఉత్తర కాశ్మీర్ పరిధిలోని బారముల్లా ప్రాంతంలోని క్రేరీ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ ఎన్ కౌంటర్లో తప్పించుకుని పారిపోయిన ముష్కరమూలను పట్టుకునేందుకు ఆయా ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నాయి భద్రతా ధళాలు. బారాముల్లా ప్రాంతంలో కార్డన్ సెర్చ్ అపరేషన్ కొనసాగుతోంది.
అంతకు కొన్ని గంటల ముందు బారాముల్లా జిల్లాలోని కెర్రి ప్రాంతంలో గస్తీలో వున్న పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి ముగ్గురు భారతీయ జవాన్ల హతమార్చారు, బారాముల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో పాటు ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లాలోని క్రీరి చెక్ పోస్టు వద్ద సీఆర్పీఎఫ్, జమ్ము పోలీసులు కలిసి విధులు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున చెక్ పోస్టు వద్ద ఉన్న పోలీసులపై ముగ్గురు లష్కరే తోయిబా గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపి పరాయయ్యారు.
ముష్కరులు చెక్ పోస్టు వద్దనున్న పోలీసులపై కాల్పులు జరిపి హతమర్చారన్న సమాచారం తెలిసిన వెంటనే అక్కడకు అదనపు బలగాలు పంపించామని జమ్ముకశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం సమీపంలోని దట్టమైన పోదల్లోంచి వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు ఒక్కసారిగా పోలీసులపై కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. ఇది అత్యంత రిపోట్ గ్రామీణ ప్రాంతంలో వున్న చెక్ పోస్టు కావడంతో అక్కడి చెక్ పోస్ట్ నిర్వహణ కేవలం ముగ్గరు సభ్యులనే నియమించామని, ఈ విషయం తెలిసే ఉగ్రవాదులు వారిని టార్గెట్ చేసి వుంటారని ఆయన అన్నారు, కాగా గడిచిన వారం రోజుల్లో పోలీసులపై దాడులు జరగడం ఇది మూడోసారి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more