కరోనా మహమ్మారి విజృంభనతో యావత్ ప్రపంచ ప్రజలు అందోళనకు గురవుతున్న తరుణంలో అందరూ దాని నుంచి రక్షణ పొందేందుకు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా దానిని నుంచి పరిరక్షణ పోందేందుకు ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో రకాల మాస్కులు అందుబాటులోకి వస్తున్నాయి. ధనవంతులు మాస్కుల విషయంలోనూ కాస్త వెరైటీగా ఆలోచిస్తున్నారు. తమ డాబు, దర్పాలను ప్రదర్శించడానికి అతి ఖరీదైన మాస్కుల కోసం ఆర్డర్లు ఇస్తున్నారు.
ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారి బంగారంతో మాస్క్ తయారు చేసుకుని దరించిన విషయం తెలిసిందే. ఇక ాయన చేతి వేళ్లకు కూడా బంగారు ఉంగరాలు ఉండటంతో ఆయన శ్రీమంతుడేనని వార్తులు వచ్చాయి. ఇక ఆయన ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కావడం కూడా గమనార్హం. ఇక తాజాగా అలాంటి బంగారం తోనే మాస్క్ చేయించుకున్న వ్యక్తి వివరాలు వెలుగులోకి వచ్చింది. అమెరికాలో నివసిస్తోన్న ఓ చైనా వ్యాపారవేత్త ప్రపంచంలోనే అతి ఖరీదైన మాస్కును ధరించాలని యోచిస్తూ, దాన్ని ఆర్డర్ చేశారు.
టాప్ రేటెడ్ ఎన్ 99 ఫిల్టర్లు, పసిడి, వజ్రాలు పొదిగిన మాస్క్ ను తయారు చేయాలని కోరారు. సుమారు 11.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ఆ చైనా వ్యాపారి ఈ మాస్కును తయారు చేయించుకుంటున్నారు. జెరూసలేంలో ఓ ఆభరణాల సంస్థలో పనిచేస్తోన్న డిజైనర్ ఐజాక్ లెవీ ఈ విషయాన్ని వెల్లడించారు. 18 క్యారెట్ల వైట్ గోల్డ్తో దీన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. మాస్కు చుట్టూ 3,600 తెలుపు, నలుపు వజ్రాలతో అలంకరించనున్నామని వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి దీని తయారీని పూర్తి చేస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more