కోజికోడ్ ప్రమాదఘటనలో ఏకంగా 19 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంలో వాతావరణ అనుకూలతే ప్రధాన కారణమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయమై స్పష్టతనిచ్చింది డైరెక్టర్ జనరల్ అప్ సివిల్ ఏవియేషన్ చీఫ్ అరుణ్ కుమార్. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని దుబాయ్ నుంచి వందేభారత్ మిషన్ లో భాగంగా వస్తున్న ఎయిర్ ఇండియా విమానం పైలట్లకు ముందుగానే సమాచారాన్ని అందించామని చీఫ్ అరుణ్ కుమార్ వెల్లడించారు.
ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పడంతో ఇద్దరు పైలట్లు సహా 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. పెనుగాలులు, వర్షం గురించి పైలట్లకు తెలుసునని, అయితే వాతావరణం పూర్తిగా అదుపుతప్పలేదని, అందువల్లే వారు ల్యాండింగ్ కు ప్రయత్నించారని అరుణ్ వివరించారు. ఈ ప్రమాదానికి వాతావరణ పరిస్థితులే కారణమని ఆయన అన్నారు. ఏటీసీ నుంచి పైలట్లకు వాతావరణంపై సమాచారం వెళ్లింది. విమానం రన్ వే చివర్లో వేగంగా ల్యాండ్ అవడాన్ని గమనించిన ఏటీసీ, వెంటనే రెస్క్యూ టీమ్ లను అప్రమత్తం చేసింది.
"ఫైర్ ఫైటర్లు సహా సహాయక సిబ్బంది వెంటనే స్పందించారు. విమానం దగ్గరకు నిమిషాల్లోనే వెళ్లారని ఆయన తెలిపారు. విమానం ప్రమాదానికి గురైన 10 నిమిషాల వ్యవధిలోనే రెస్క్యూ ప్రారంభమైందని వెల్లడించారు. విమానం క్రాష్ ల్యాండ్ అయిన తరువాత, కాక్ పిట్ నుంచి ఏటీసీకి ఏమైనా సమాచారం అందిందా? అన్న ప్రశ్నకు విచారణ తరువాతే ఈ విషయమై సమాచారం లభిస్తుందని తెలిపారు. కాగా, రన్ వే ప్రారంభమైన కిలో మీటర్ తరువాత విమానం వేగంగా వచ్చి ల్యాండ్ కావడం, సురక్షితంగా విమానాన్ని నిలిపేంత రన్ వే అక్కడ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని డీజీసీఏ ప్రాథమిక విచారణలో తేల్చింది.
ఈ ప్రమాదానికి గల కారణాలపై లోతైన దర్యాఫ్తు చేసేందుకు విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి ఓ టీమ్ వచ్చే వారంలో ఇండియాకు రానుంది. దీంతో బోయింగ్ సంస్థ విచారణ పూర్తైన తరువాత కానీ పూర్తి వివరాలు వెలుగులోకి రావని తెలుస్తోంది. ఇక దీనికి తోడు కోజికోడ్ విమానాశ్రయం టేబుల్ టాప్ తరహాలో వుంటుందని.. విమానం రన్ వేపై దిగే సందర్భంలో వేగాన్ని నియంత్రించలేకపోవడం కారణమని సమాచారం, దీంతో పాటు రన్ వే పై చివర్లో విమానం దిగడం మరో కారణమని అధికార వర్గాలు ప్రాథమిక నిర్థారణకు వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more