సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కరోనాతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. జులై 29న అనారోగ్యంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే నంది ఎల్లయ్యను బతికించేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విఫలం అయ్యాయి, కరోనాకు తోడు వయోభారంతో వచ్చే రుగ్మతలు కూడా నంది ఎల్లయ్య ప్రాణాలు హరించేందుకు కారణంగా మారాయి, చికిత్సకు ఆయన శరీరం కూడా సహకరించకపోవడంతో ఆయన ఇవాళ ఉదయం మరణించారు.
ఆరుసార్లు లోక్సభకు, రెండు సార్లు రాజ్యసభకు నంది ఎల్లయ్య ఎన్నికయ్యారు. సిద్దిపేట నుంచి ఐదుసార్లు, నాగర్ కర్నూల్ నుంచి ఒకసారి ఎంపీగా గెలిచారు. యావత్ దేశం నరేంద్రమోడీ మ్యానియాకు లోంగి ఆయనను ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్న తరుణంలోనూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నంది ఎల్లయ్య మాత్రం విజయాన్ని అందుకున్నారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథంను ఓడించి 16వ లోక్సభకు ఎన్నికయ్యారు. కొన్నాళ్లు ఎమ్మెల్సీగానూ సేవలందించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. నంది ఎల్లయ్య మృతిపట్ల పలు పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు.
నంది ఎల్లయ్య అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జి కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిబద్దతతో క్రమశిక్షణతో నంది ఎల్లయ్య పనిచేశారన్నారు. ఆయన క్రమశిక్షణ నేటి తరానికి ఆదర్శం. ఓటమి ఎరగని నేత, దళిత బాంధవుడు నంది ఎల్లయ్య. గాంధీ ఆశయాలను తుచ తప్పకుండా పాటించిన ఆదర్శ నాయకుడని కోనియాడారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుని పేర్కోన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more