మరణం అంచుల వరకు వెళ్లివచ్చాను అని పలు సందర్భాలలో అనుభవాలను పంచుకుంటూ చెప్పేవారు వుంటారు. అలాంటి అనుభవమే ఇప్పుడు ఓ ద్విచక్రవాహన చోదకురాలికి ఎదురైంది. మరోలా చెప్పాలంటే ఈమెకు ఇంకా భూమి శివుడాజ్ఞ రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈమె ఏకంగా మృత్యు ముఖంలోకి వెళ్లి ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసినవారు కారు కింద పడిన మహిళ ప్రాణపాయ స్థితిలోకి జారుకుని వుంటుంది లేదా.. ఊహించనిదే జరిగివుంటుదని బావించడంలో తప్పులేదు.
ఈ విస్తుగోలిపే ఘటన కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరు పరిధిలోగల కాద్రి కంబ్లా జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. ఈ రహదారి ప్రధాన కూడలి మీదుగా స్కూటర్ వెళ్తున్న వాణిశ్రీ అనే మహిళను ఓ కారు అడ్డుగా వచ్చింది. వామనాన్ని నిలిపే లోపు కారు డీకోనడంతో పాటు అమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఎగిరి కారు బానెట్ పై పడి.. అక్కడి నుంచి కింద పడింది. అయితే అమెను గమనించ లేదో.. లేక హైరానా చెందాడో తెలియదు కానీ కారు డ్రైవర్ తన వాహనాన్ని ముందుకే పోనిచ్చాడు. దాంతో కారు ఆమె మీదుగా వెళ్లింది.
అయితే, ద్విచక్ర వాహానాన్ని కారు డీకొనడంతో శబ్దం విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై కారును అడ్డుకున్నారు. డ్రైవర్ కారు నిలపడంతో స్థానికులు వెంటనే కారును వెనక్కి నెట్టి.. కారు కిందకు పడిపోయిన మహిళను రక్షించేందుకు ప్రయత్నంలో భాగంగా కారుని అమాంతం పెకెత్తి మహిళను బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించారు. వాణిశ్రీకి ఎలాంటి అపాయం లేదని, చిన్న గాయాలే తగిలాయని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంపై కామెంట్ల వర్షం కురుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more