(Image source from: english.tupaki.com)
ప్రపంచవ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరిపై తన ప్రభావాన్ని చూపుతున్న కరోనా మహమ్మారి ఇటు మన తెలుగు రాష్ట్రాల్లోనూ తన వ్యాప్తిని అంతకంతకూ విస్తరింపజేసుకుంటోంది. ఇదివరకుఅధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పలువురు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ మంత్రి మాణిక్యాల రావు, తెలంగాణకు చెందిన భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే సున్నం రాజయ్యలు ఇప్పటికే అసువులు బాసారు. ఇక ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకగణం కూడా కరోనాబారిన పడ్డారు. వారిలో పలువురు మృతి చెందిన విషయం కూడా తెలిసిందే.
కాగా తాజాగా ఈ జాబితాలో బీజేపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా చేరారు. టీడీపీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నుంచి బీజేపిలోకి చేరిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన తాజాగా కరోనా బారిన పడ్డారు. సీఎం రమేశ్ కు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యిందని వైద్యులు తెలిపారని ఆయన తన సామాజిక మాద్యమం ట్విట్టర్లో తెలిపారు.
ఈ మేరకు ఇవాళ ఉదయం ఆయన తాజాగా చేసిన ట్వీట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నానని.. వైద్యుల సూచనల మేరకు గృహంలో స్వియ నిర్భంధంలో (హోం ఐసోలేషన్) వుంటున్నానని అన్నారు. కరోనా సోకినా తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఏ అనారోగ్య సమస్యలు కూడా లేవని, తాను అరోగ్యంగా వున్నానని తెలిపారు. అయితే కరోనా నుంచి బయటపడేందుకు డాక్టర్ల సూచనలను తప్పక పాటిస్తున్నానని ఆయన పేర్కోన్నారు, తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు స్వయంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు.
I have tested positive for #COVID__19. Whilst I am doing fine, I am being under isolation on the recommendation of doctors.
— CM Ramesh (@CMRamesh_MP) August 7, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more