ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి దేశంలోనూ రోజురోజుకీ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు నమోదు కాగా, మార్చి వరకు నిరీక్షించిన కేంద్రం మార్చిలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు గాను లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ అన్ని రాష్ట్రాలు కూడా కఠినంగా అమలు చేశాయి. ఈ నేపథ్యంలో కరో్నా వ్యాప్తి నెమ్మదిగా విస్తరిస్తున్న తరుణంలో వైద్యఅరోగ్య అధికారులు సత్వర చర్యలు తీసుకుని వ్యాప్తిని నియంత్రించగలిగారు. దీంతో మే 18వ తేదీకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరింది.
ఇక అప్పటికే పలు విడతల లాక్ డౌన్ లు చూసిన ప్రజలు కుటుంబపోషణ నిమిత్తం రోడ్డు ఎక్కారు. అప్పటికే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు వ్యాపించడంతో.. సరిగ్గా పక్షం రోజలు అనగా జూన్ మాసం తొలినాళ్లకు చేరుకునే సమయానికి ఈ కేసుల సంఖ్య రెండు లక్ష్కల మార్కును అందుకున్నాయి. ఇక గత ఐదు రోజులుగా సాలీనా రోజుకు పది వేల కేసులు నమోదవుతూ దేశ ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇక అదే సమయంలో మరణాలు కూడా రోజుకు రెండవందలకు పైగా నమోదు కావడం దిగ్ర్భాంతిని కలిగించే అంశం.. అయితే ప్రజలు మాత్రం దీనిపై ఎలాంటి అందోళనకు గురికావాల్సిన పనిలేదని, అయితే అప్రమత్తంగా మాత్రం మెలగాల్సిందేనని కేంద్రం సూచిస్తో్ంది.
కరోనా మహమ్మారి కేసుల సంఖ్య దేశంలో పెరుగుతున్న మాట వాస్తవమే అన్ని కేంద్రం.. దీనిని బట్టి దేశంలో కరోనా సామూహ వ్యాప్తి దశకు మాత్రం చేరలేదని వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, తమిళనాడు, గుజరాత్, రాజఃస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుదల నేపథ్యంలో సామూహిక వ్యాప్తికి సంబంధించి వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ‘ఈ పదంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డబ్ల్యూహెచ్ఓ దాన్ని నిర్వచించలేదు. కరోనా వ్యాప్తి దేశంలో చాలా తక్కువగా ఉంది. అది 1శాతం కంటే కూడా తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో కొంచెం ఎక్కువగా ఉంది. మనం కచ్చితంగా సామూహిక వ్యాప్తి దశలో లేము’ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అన్నారు.
మహమ్మారికి మూడో దశనే సామూహిక వ్యాప్తి అంటారు. అది వైరస్ సోకడానికి కారణమైన మూలాన్ని గుర్తించలేని స్థితి. దిల్లీ, ముంబయి వంటి నగరాల్లో కేసుల సంఖ్య పెరగడంతో సామూహిక వ్యాప్తి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే దిల్లీలో నమోదవుతోన్న చాలా కేసులకు మూలాన్ని గుర్తించడం సాధ్యం కాలేదని, రాజధాని నగరం సామూహిక వ్యాప్తి దశలో ఉందా? అనే అంశంపై కేంద్రమే ప్రకటన చేస్తుందని సోమవారం దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more