ఛత్తీస్ గఢ్ తొలి ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్ వ్యవస్థాపకుడు అజిత్ జోగి పరమపదించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొంత కాలంగా రాయ్ పూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా అజిత్ జోగి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గోరెలాలో జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు, మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగికి అధికార హోదాలో రాష్ట్రప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించనుంది, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ మాజీ నేతకు ఘనంగా తుది వీడ్కోలు పలుకనుంది.
ఆయన మరణ వార్తను అజిత్ జోగి తనయుడు అమిత్ జోగి ట్విటర్లో వెల్లడించారు. ఛత్తీస్ గఢ్ గోప్ప నాయకుడిని కోల్పోయిందని, తనతో పాటు యావత్ రాష్ట్రం తమ తండ్రిని కోల్పోయిందని ట్వీట్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు, చత్తీస్ గడ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన వయస్సు 74 ఏళ్లు. అజిత్ జోగి మరణం పట్ల వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గూటిలో సుమారు 30 ఏళ్లు కొనసాగడంలో ఆయనకు కాంగ్రెస్ నేతల మరణం వరకు సత్సంబంధాలు కొనసాగాయి. దీంతో ఆయనకు కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తమయ్యింది.
1946 ఏప్రిల్ 29న బిలాస్ పూర్ లో జన్మించిన ఆయన.. భోపాల్ లోని మౌలానా అజాద్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత సివిల్స్ పరీక్షలు రాసీన ఆయన అందులోనూ ఉత్తర్ణుడై ఐపీఎస్గా ఎంపికయ్యారు, రాజకీయాలకు ముందు ఆయన మధ్యప్రదేశ్ లోని భోపాల్, ఇండోర్ జిల్లాలకు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2000 సంవత్సరంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగిన ఆయన ప్రచారపర్యంలో బిజిగా వుండగా ప్రమాదానికి గురై వీల్ చైర్ కు పరిమితమయ్యారు, ఆ ఎన్నికలలో చత్తీస్ గడ్ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎంపీ ఆయనే. ఇక 2008లో ఆయననే సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పేర్కోన్నా ప్రజలు రమణ్ సింగ్ కు ఓటు వేసి బీజేపిని గెలిపించారు. 2016లో కాంగ్రెస్తో విభేదాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ పార్టీని స్థాపించారు. ఆయన మరణం పట్ల చత్తీస్ గడ్ కు చెందిన పలువురు రాజకీయ, జాతీయ ప్రముఖులు కూడా సతీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు, ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more