ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభన మళ్లీ పెరుగుతోంది. రాష్ట్ర వాసుల్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి.. గత వారం రోజులుగా తన వేగాన్ని తగ్గించుకోగా.. మళ్లి నిన్నటి నుంచి వేగాన్ని అందుకుంది. తాజాగా రాష్ట్రంలో యాభై మార్కు దాటిన కరోనా కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటూ.. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు మిషన్ లుగా కరోనా నియంత్రణను చేపట్టినా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో 52 కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది.
తాజాగా నమోదైన 52 పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 వేల మూడు వందల మార్కుకు చేరువలో వుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజా గణంకాలతో కలిపి రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 2282కి చేరింది. కాగా రాష్ట్రంలో మరణాల సంఖ్య మాత్రం యదాతథంగా వుంది. అయితే తమిళనాడులోని కోయంబేడు మార్కెట్కు వెళ్లి వచ్చిన వారితోనే ఇవాళ కేసులన్నీ నమోదు అయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ మార్కెట్ కు చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరివాసులు వెళ్లడంతో అక్కడే ఎక్కువగా కేసులు నమదయ్యాయి.
ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 52 మరణాలు సంభవించడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా చిత్తూరులో 15, కృష్ణలో 15 కేసులు నమోదయ్యాయి, ఈ జిల్లాలతో పాటు నెల్లూరులో ఏడు, తూర్పు గోదావరిలో 5, కర్నూలు నాలుగు, కడపలో రెండు, విశాఖపట్నంలో 1, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో ఒక్క కేసు నమోదయ్యాయి, ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 1527 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 705 మంది చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా రాష్ట్రంలో మరో కరోనా మరణం కూడా నమోదైంది. దీరతో మరణాల సంఖ్య 50కి చేరింది.
జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురంలో 122 కరోనా కేసులు నమోదుకాగా, 4 మరణాలు సంభవించాయి. చిత్తూరులో 192 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, తూర్పు గోదావరిలో 57 కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 417 కేసులు ఎనమిది మరణాలు సంభవించాయి, కడపలో 104 కేసులు నమోదుకాగా, కృష్ణా జిల్లాలో 382 పాజిటివ్ కేసులు, పదిహేను మరణాలు. కర్నూలులో నమోదైన కరోనా కేసులు 615గా వుండగా, 19 మరణాలు సంభవించాయి. నెల్లూరు-152 కేసులు మూడు మరణాలు, ప్రకాశం- 66, శ్రీకాకుళంలో 14 కేసులు నమోదయ్యాయి, విశాఖపట్నంలో 76 కరోనా కేసులు నమోదు కాగా ఒక మరణం సంభవించింది. విజయనగరంలో 8, పశ్చిమగోదావరి-72 కేసులు నమోదయ్యాయి,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more