HC issues notices to state and center govts ఎల్జీ పాలీమర్స్ సంస్థపై కేసులు.. హైచ్ఆర్సీ, హైకోర్టు నోటీసులు..

Visakhapatnam gas leak nhrc ap hc issues notices to state and center govts

lg polymers, lg polymers gas leakage, visakhapatnam lg polymers, visakhapatnam lg polymers gas leak, lg polymers visakhapatnam gas leak, lg polymers vizag gas leak, lg polymers gas leakage, lg polymers gas leakage news, lg polymers gas leakage latest news, lg polymers gas leakage today news, visakhapatnam lg polymers gas leakage news

Aprat from Andhra Pradesh police the High court also expressed outrage over the gas leakage accident which took place at LG Polymers at midnight, The apex court took a Suomoto case and investigating it. On the other hand NHRC also issued notices to state government in this regard.

ఎల్జీ పాలీమర్స్ సంస్థపై కేసులు.. హైచ్ఆర్సీ, హైకోర్టు నోటీసులు..

Posted: 05/07/2020 05:04 PM IST
Visakhapatnam gas leak nhrc ap hc issues notices to state and center govts

గ్యాస్‌ లీకేజీ ఘటనకు కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఎల్‌జీ పాలీమర్స్‌ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకేజీ నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎన్‌డీఆర్‌ఎఫ్‌, నౌకాదళ సిబ్బంది సాయంతో లీకేజీని నియంత్రించినట్లు చెప్పారు. గ్యాస్‌ లీకేజీ కారణంగా పరిశ్రమ నుంచి 1.5 కిలోమీటర్ల పరిధిలో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. పరిసర ప్రాంతాల్లో నీటి పిచికారీ ద్వారా గాల్లో గ్యాస్‌ ప్రభావాన్ని నియంత్రించినట్లు వివరించారు.

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీపై  గోపాలపట్నం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సెక్షన్‌ 337, 338, 304 కింద కేసులు నమోదు చేసినట్లు గోపాలపట్నం పోలీసులు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకైన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్ హెచ్ఆర్సీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మీడియా కథనాలనే ప్రాథమిక సమాచారంగా పరిగణిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఈ ఘటన మానవ తప్పిదంగానో, నిర్లక్ష్యంగానో జరిగినట్టు వెల్లడి కాకపోయినా, ఇది మానవ హక్కులకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనగా కమిషన్ భావిస్తోంది.

"జీవించడం ప్రజల హక్కు. అలాంటి హక్కును కేత్రస్థాయి నుంచి ఉల్లంఘించారు. ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తికి భయపడి అందరూ ఇళ్లలో ఉన్న సమయాన ఉరుముల్లేని పిడుగులా ఈ విషవాయువు లీకైంది" అని కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని ఏపీ సీఎస్ ను ఆదేశించింది. వైద్య చికిత్స వివరాలు, సహాయక చర్యల వివరాలు కూడా తమకు నివేదించాలని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్ తాలూకు వివరాలు, దర్యాప్తు వివరాలు తమకు తెలియజేయాలంటూ రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపింది. ఇందుకుగాను నాలుగు వారాల గడువును విధించింది.

జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమ ఎలా ఏర్పాటు చేశారంటూ ఏపీ హైకోర్టు వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను అమికస్ క్యూరీగా నియమించింది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకైన ను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఓ ఘటనను సుమోటోగా స్వీకరించడం అంటే ప్రభుత్వ వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్నామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles