అపదలో వున్న అమ్మాయిని అదుకోవాల్సిన వైద్యుడు.. అదీ అత్యంత అవసరమైన సమయంలో ఐసోలేషన్ సెంటర్ లో వుండగా.. రెండు రోజుల పాటు అమెపై అఘాయిత్యం జరిగింది. అతిరక్తస్రావం జరగడంతో అమె మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన బీహార్ లోని గయా ప్రాంతంలో దారుణం జరిగింది. మెడికల్ కాలేజీ ఐసోలేషన్ వార్డులో ఉన్న మహిళను రెండ్రోజుల పాటు రేప్ చేయడంతో అతిగా రక్తస్రావమై మృతి చెందింది. విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కరోనా లక్షణాలు కనిపించడంతో అనుగ్రహ్ నరైన్ మగధ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లోని ఐసోలేషన్ వార్డులో మహిళను చేర్పించారు. '25ఏళ్ల బాధితురాలు పంజాబ్ లోని లూధియానా నుంచి బీహార్ లోని గయా జిల్లాకు వచ్చింది. ఆ ప్రయాణం సమయంలో మహిళకు రెండు నెలల గర్భిణీ అబార్షన్ అయింది. అతిగా రక్త స్రావం అవుతుండటంతో ఆమెను గయాలోని హాస్పిటల్లో చేర్పించారు. మార్చి 27న ఆమెను అనుగ్రహ్ మెడికల్ కాలేజీలో ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్నారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిందిగా సూచించారు.
అక్కడే మహిళపై ఏప్రిల్ 2, 3 తేదీల్లో డాక్టరే అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండ్రోజుల తర్వాత కరోనా టెస్టు ఫలితం నెగెటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా భయంగా ఉండటంతో అత్తయ్యకు జరిగిన విషయం చెప్పింది. ఐసోలేషన్ వార్డులో డాక్టర్ తనతో ప్రవర్తించిన తీరును వివరించింది. ఏప్రిల్ 6న ప్రాణం కోల్పోయింది. ఘటనపై స్పందించిన పోలీసులు మహిళ అత్తయ్యను హాస్పిటల్ కు వచ్చి వైద్యుడ్ని గుర్తించాలని కోరారు. హాస్పిటల్ సూపరిండెంట్ ఇది చాలా సీరియస్ విషయమని తేలిగ్గా విడిచిపెట్టకూడదని సూచించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నేరస్థుడికి తగిన శాస్తి చేయాలని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more