కరోనా వైరస్ నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి అతలాకులం కాకుండా ఆర్థిక ప్యాకేజీని త్వరలో కేంద్రం ప్రకటించనుందని, ఈ మేరకు ఇప్పటికే ఉద్దీపన పథకాలపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే లాక్డౌన్ ప్రకటించినట్లు సీతారామన్ స్పష్టం చేశారు. దిల్లీలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్తో కలిసి సీతారామన్ మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన పథకాలు ప్రకటించనున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
దీనిలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను సీతారామన్ మీడియాకు వివరించారు. ‘2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నుల దాఖలుకు 2020 జూన్ 30 వరకు గడువు పొడిగించాం. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుము 12 నుంచి 9 శాతానికి, టీడీఎస్ జమలో ఆలస్య రుసుమును 18 నుంచి 9 శాతానికి తగ్గించాం. ఆధార్-పాన్ అనుసంధానం, ‘వివాద్ సే విశ్వాస్’ పథకం గడువును జూన్ 30 వరకు పొడిగించాం. పన్ను వివాదాల మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగించాం. మార్చి, ఏప్రిల్, మే జీఎస్టీ రిటర్న్ల దాఖలు గడువు జూన్ 30 వరకు పొడిగించామని’’ అన్నారు.
కాంపొజిషన్ స్కీమ్ రిటర్న్ల దాఖలుకు కూడా జూన్30 వరకు గడువును పొడిగించామని కేంద్ర విత్త మంత్రి తెలిపారు. రూ. 5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలపై పన్ను చెల్లింపు ఆలస్య రుసుములు ఉండవన్నారు. రూ. 5 కోట్ల టర్నోవర్ పైబడిన పెద్ద కంపెనీలకు పన్ను చెల్లింపులపై వడ్డీ, అపరాధ రుసుం 9 శాతానికి తగ్గించామని సీతారామన్ తెలిపారు. ఖాతాదారులు అన్ని ఏటీఎంలలో నుంచి నగదు తీసుకోవచ్చని.. మూడు నెలల పాటు ఎలాంటి ఛార్జీలు వర్తించవని స్పష్టం చేశారు. బ్యాంకుల్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం కూడా లేదని సీతారామన్ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more