ఆనందంగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా అంధకారమయం అయ్యింది. నూరేళ్లు వుంటానని ప్రమాణం చేసిన భర్త అర్థాయుష్షుతోనే తనను ఒంటరి చేస్తే.. తన రెక్కల కష్టాన్ని నమ్ముకుని.. తనపై అధారపడిన ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్న ఆమె అకస్మాత్తుగా తనువు చాలించాలనుకుంది. అమెను కూడా ఇబ్బంది పెట్టింది తాజా సాంకేతిక అస్త్రమే. తాను స్నేహితులుగా నమ్మిన మహిళలే తన పాలిట కాలయములుగా నిలిచారు. తీరని కష్టం, వీడని వేదన చెప్పుకుంటే తగ్గుతుందని అమె తన కష్టాలన్నీ స్నేహితులతో పంచుకుంటే.. వాటినే అసరగా చేసుకుని వ్యభిచారం చేయమంటూ వారే ఒత్తడి చేయడంతో పాటు బెదిరింపులకు కూడా దిగారు.
స్నేహితులు తనను బలవంతంగా రొంపిలోకి దింపుతున్నారని, రూ.2 లక్షలను ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారని వారిపై స్థానిక మహిళా పోలిస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసింది. కష్టాలన్ని కట్టకట్టుకుని వచ్చినట్టు అమె విషయంలోనూ జరిగిందిదే. అమె పిర్యాదు పోలీసులు తీసుకున్నారే కానీ దాని వంక కనీసం పరిశీలనగా చూసింది కూడా లేదు. దీంతో ఇక తనకు మరణమే శరణ్యమనుకున్న మహిళ.. నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అమె కుటుంబసభ్యులు గమనించి అమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని విల్లుఫురం జిల్లాలోని సెన్జీ ప్రాంతంలోని సత్యమంగళం గ్రామానికి చెందిన బాధితురాలు తన భర్త అకాల మృతితో తన తల్లిదండ్రులు ఇంటి వద్దే వుంటోంది. అయితే తన ముగ్గురి పిల్లల చదువుల కోసం అమె చిన్నపాటి ఉధ్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే అమెకు కొంత ఊరటనిచ్చిన టిక్ టాక్ వీడియోలను చూస్తూ అమె తన కష్టాలను కొంతసేపు పక్కనబెట్టేది. ఈ టిక్ టాక్ ద్వారా పరిచయమైన ముగ్గురు మహిళలను నిజమైన స్నేహితులుగా భావించింది. వారికి తన కష్టాలన్నీ చెప్పుకుంది.
ప్రాణం లేని కాసులకే ప్రాయారిటీ ఇవ్వడం తప్ప మనస్సున్న మనుషులకు ఏ మాత్రం గౌరవం ఇవ్వని నేటి రోజుల్లో.. అమె స్నేహితులుగా బావించిన ముగ్గురు మరో అకు ఎక్కువగానే చదివేశారు. ఇటీవల టిక్ టాక్ యాప్ లో చెన్నైకి చెందిన సుమతి, లత, కవిత అనే ముగ్గురు టిక్ టాక్ యాప్ ద్వారా పరిచయమై స్నేహితులుగా మారారు. కొంతకాలం ఆమెతో స్నేహంగా ఉన్న ఆ మహిళలు తర్వాత తమ నిజస్వరూపం చూపారు. అంతే అమెను మరింత అంధకారంలోకి తోసే ప్రయత్నం చేశారు. కష్టపడి జీవనాన్ని నెట్టుకు రావడం ఏంటీ.. ఈజీగా డబ్బు సంపాదించాలని అగడకుండానే సలహాలు ఇచ్చారు.
అదెలా అంటే వ్యభిచారం చేయాలంటూ ఆమెను ఒత్తడి చేశారు. వారి మాటలు వినకపోవడంతో బలవంతపెట్టారు. అడగకుండా ఇచ్చిన సలహాకే తమకు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అంతేకాదు ఇద్దరు పురుషులను పంపి రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే కిడ్నాప్ చేసి హత్యచేస్తామని బెదిరించడం మొలుపెట్టారు. దీంతో సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, వారి నుంచి బెదిరింపులు అధికం కావడంతో తట్టుకోలేని కడల్కన్ని ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. వెంటనే గుర్తించిన కుటుంబీకులు ఉరితాడు తొలగించి చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల్లో ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more