దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ పెట్టుకున్న పటీషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని అదేశించింది. 'ఎవరైనా దోషికి మరణశిక్ష విధించబోతున్న క్రమంలో అతను పెట్టుకున్న పిటిషన్ కంటే అర్జెంట్ గా విచారించాల్సిన అంశం ఏదీ ఉండదు. దానికి అత్యున్నత ప్రాధాన్యత (టాప్ ప్రియారిటీ) ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నిర్భయ కేసు దోషి ముకేష్ సింగ్ పెట్టుకున్న అభ్యర్థనపై అర్జెంట్ లిస్టింగ్ కోసం రిజిస్ట్రీని సంప్రదించాలని ఆయన తరఫున న్యాయవాదిని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. చివరి ప్రయత్నంగా ముకేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈనెల 17న తోసిపుచ్చారు. దీంతో ముఖేష్ కు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గించాలని కోరుతూ ఆయన తరఫు లాయర్ వృందా గ్రోవెర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగానే బెంచ్ తాజా వ్యాఖ్యలు చేసింది.
'మరణశిక్ష ఖరారైన దోషి కోర్టు ముందుకు వస్తే దానికంటే అర్జెంట్గా చేపట్టాల్సిన అంశం ఇంకేముంటుంది. దానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి' అని సీజేఐ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఆర్ గవాయ్, సూర్యకాంత్ లతో కూడిన డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన క్షమాభిక్ష పిటీషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ సింగ్ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. కాగా, దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయనున్నందున కేసు అర్జెంట్ లిస్టింగ్ కోసం రిజిస్ట్రీని గ్రోవెర్ కలుసుకోవాలని సూచించింది. ముకేష్, మరో దోషి వినయ్ కుమార్ శర్మ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ను జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈనెల 15న తోసిపుచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more