ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుతో పాటు అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ది మండలి రద్దు బిల్లుపై రాష్ట్ర శాసన మండలిలో వ్యతిరేకతను చవిచూసిన తరువాత తెరపైకి వచ్చిన మండలి రద్దు అంశాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినేట్ ఇవాళ అమోదించింది. ఈమేరకు ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన ఏపీ క్యాబినెట్ ఈ మేరకు శాసనమండలి రద్దు తీర్మాణాన్ని ఏకగ్రీవంగా అమోదించింది. దీనిని వెనువెంటనే రాష్ట్ర శాసనసభలోనూ ప్రవేశపెట్టి.. అమోదించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తమ సంఖ్యాబలంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను శాసనమండలిలో సంఖ్యాబలం వున్న విపక్షం అడ్డుకోగలిగింది. ఈ రెండు బిల్లులు మండలిలోకి రాగా, టీడీపీ సభ్యులు రూల్ 71 తీసుకురావడం, ఈ రూల్ కే అనుకూలంగా ఓటు వేయడంతో బిల్లును చర్చకు అనుమతించకుండానే సెలెక్ట్ కమిటీ చైర్మెన్ కు పంపడంతో వైసీపీ షాక్ కు గురైంది. బిల్లులను ప్రవేశపెట్టిన వేళ.. మండలిలో ఏకంగా 22 మంది వైసీపీ మంత్రులు వున్నా.. ఎలాంటి ప్రభావాన్ని చాలేకపోయారని.. ఇదే భవిష్యత్తులో కొనసాగితే తమ ప్రభుత్వంపై అదిపత్యం విపక్షాలదవుతుందని భావించింది.
దీంతో మండలిని రద్దు చేయాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శాసనమండలి రద్దు విషయమై న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చించింది. ఆనంతరం ఇవాళ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఈ మేరకు సమావేశమైన క్యాబినెట్.. మండలి రద్దుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అనంతరం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అసంబల్లీలో సంఖ్యబలం వున్నందున ఈ పనిని కూడా ఇవాళే ముగించే అవకాశం వుంది. అయితే బిల్లు అసెంబ్లీలో అమోదం పోందిన తరువాత దానిని తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది.
ఈ తీర్మాణాన్ని పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం పొందిన తర్వాత.. రాష్ట్రపతి నోటిఫై చేసిన తర్వాతే.. శాసనమండలి రద్దు కానుంది. అయితే లోక్ సభలో ఈ బిల్లును వెనువెంటనే కేంద్రం పెట్టాల్సిన పనిలేదు. లోక్ సభలో బిల్లు అమోదం పోందిన తరువాత రాజ్యసభలోనూ ఈ బిల్లు అమోదం పోందాల్సిన అవసరం వుంది. అయితే ఇప్పటికే రాష్ట్రం నుంచి పంపించిన అనేక తీర్మాణాలు కేంద్రం వద్ద పెండింగులో వున్నాయి. ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దు తీర్మాణం ఇకపై కేంద్రం చేతిలోకి వెళ్లిపోయినట్టే. కేంద్రం ఎప్పుడు తమకు అనుకూలం అనుకుంటే అప్పుడు ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్యను బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్ ఆమోదం లభించకపోతే మాత్రం.. శాసన మండలి రద్దు కష్టమేనని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more