కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మాట్లాడుతున్నానంటూ మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్కు ఫోన్ చేసిన భారత వాయుసేన వింగ్ కమాండర్ను స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. వింగ్ కమాండర్ కుల్దీప్ బఘేలా.. గవర్నర్ కార్యాలయానికి ఫోన్ చేసి తాను అమిత్ షా పర్సనల్ అసిస్టెంట్నని, గవర్నర్కు ఫోన్ కలపాలని కోరాడు. గవర్నర్ లైన్ లోకి రాగానే.. తాను అమిత్ షాను మాట్లాడుతున్నానని గవర్నర్ తో సంభాషించాడు.
అయితే నేరుగా విషయంలోకి ఎంటరైన కుల్దీప్, డాక్టర్ చంద్రేశ్ కుమార్ శుక్లాను మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీకి వైస్ చాన్స్లర్ గా నియమించాలని కోరాడు. కుల్దీప్ కు మంచి స్నేహితుడైన శుక్లాకు భోపాల్ లో డెంటల్ క్లినిక్ ఉంది. అమిత్ షాలా మాట్లాడి గవర్నర్ ను మోసం చేసిన వాఘేలాతోపాటు డాక్టర్ శుక్లాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. జబల్ పూర్లోని మధ్యప్రదేశ్ మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీకి వైస్ చాన్సలర్ నియామకం కోసం గతేడాది జూలైలో రాజ్ భవన్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 3న జరిగిన ఇంటర్వ్యూకు డాక్టర్ శుక్లా కూడా హాజరయ్యాడు. అయితే, రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చి ఎలాగైనా వైస్ చాన్స్లర్ పోస్టులో కూర్చోవాలని కలలుగన్నాడు. ఇందులో భాగంగా తన స్నేహితుడైన వింగ్ కమాండర్ కుల్దీప్ వాఘేలాను కలిసి విషయం చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి తప్పుడు కాల్ ద్వారా పని కానిచ్చేయాలని కుట్ర పన్నారు. అందులో భాగంగానే కుల్దీప్.. గవర్నర్ లాల్జీకి ఫోన్ చేసి శుక్లాను రికమెండ్ చేశాడు. అయితే, ఫోన్ కాల్ ను అనుమానించిన గవర్నర్ హోంమంత్రి కార్యాలయాన్ని సంప్రదించడంతో మోసం వెలుగు చూసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more