ఆంధ్రప్రదేశ్ రాజధానిగా సీడ్ క్యాపిటల్ గా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్ తో గత 13 రోజులుగా నిరసనలు, అందోళనలు చేస్తున్న రాజధాని రైతులను అరెస్టు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు చర్యలను తీవ్రంగా ఖండించిన ఆయన.. పోలీసులు కూడా కొంత విజ్ఞతతో ఆలోచించాలని సూచనలు చేశారు. రాజధాని నిర్మాణ క్రమంలో సర్వం త్యాజించిన రైతులకు అండగా నిలిచి.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారికి త్యాగానికి కటకటాల శిక్షను నిరతిగా ఇస్తుందా.? అంటూ మండిపడ్డారు.
రాజధాని కోసం ఆందోళన చేస్తున్న వాళ్లపై కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రైతుల అరెస్టుపై పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులపై హత్యాయత్నం కింద అభియోగాలను నమోదు చేయడాన్ని తప్పుబట్టిన ఆయన పోలీసులు కూడా రాజధాని రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిపై ప్రకటన నేపథ్యంలో జరిగిన ఘటనలకు పోలీసులు రైతులపై పెట్టిన సెక్షన్లకు పొంతన వుందా.? అంటూ ఫైర్ అయ్యారు. అర్థరాత్రి ఇళ్ల ప్రహరిగోడలు దూకి రైతులను అరెస్టు చేస్తారా.? అంటూ ప్రశ్నించారు.
రైతులను గుండాలు, దొంగల మాదిరిగా పరిగణిస్తారా.? వారి కుటుంబాల్లోని మహిళలు, వృద్దులను భయభ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం.? ఈ క్రమంలో వారి కుటుంబాలు చెందిన భాయందోళనకు ఏ ప్రభుత్వం, ఏ పోలీసులు తీర్చగలరంటూ మండిపడ్డారు. 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి అందించిన రైతులను పెయిడ్ అరిస్టులంటూ అవమానించింది చాలక.. అరెస్టులతో అందోళనను అరికట్టాలని చూస్తారా..? అందుకనే వారిపై హత్యాయత్నం సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారా.? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
వెంకటపాలెం, నెక్కల్లు, మోదుగ లంకపాలెం, వెలగపూడికి చెందిన ఆరుగురు రైతులను మీడియాపై దాడి కేసులో అరెస్టు చేసిన పోలీసులు వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. రైతులను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టిడంతో విచారించిన న్యాయస్థానం రైతులపై పెట్టిన హత్యాయత్నం సెక్షన్లు సరికాదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో హత్యాయత్నానికి ఆధారాలు ఏమున్నాయని పోలీసులను ప్రశ్నించింది. తక్షణం హత్యాయత్నం అభియోగాలకు సంబంధించిన ఆధారాలను ప్రవేశపెట్టాలని అదేశించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రైతులపై హత్యాయత్నం కేసును సెక్షన్లను 373గా మార్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more