ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్ క్యాపిటల్ గా అవరావతిని కాకుండా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన జగన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రజలు గత పదమూడు రోజులుగా నిరసనలు అందోళనలు చేస్తూనేవున్నారు. సీడ్ క్యాపిటల్ గా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ తో ఇవాళ కూడా అమరావతి రైతుల నిరసన కొనసాగుతోంది. మూడు రాజధానుల నిర్ణయంపై చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ ఎవరి కోసమని రైతులు ప్రశ్నించారు.
తమ నిరసన కార్యక్రమాల్లో భాగంగా అమరావతిలోని సచివాలయానికి వెళ్లే మార్గంలో మందడం రైతులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. మందడం గ్రామ రైతులకు పరిసర ప్రాంతాల రైతుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. మందడం గ్రామ రైతులు మార్గాన్ని దిగ్బంధం చేయడంతో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. అమరావతికి వెళ్లే మార్గంలో పికెట్ ఏర్పాటు చేసిన పోలీసులు ఆ మార్గంలో కేవలం గుర్తింపు కార్డు వున్న వారిని మాత్రమే ప్రయాణించేందుకు అనుమతిస్తున్నారు.
ఇక మరోవైపు తుళ్లూరులోనూ రైతులు నిరసనలు కొనసాగుతున్నాయి. మహాధర్నా ప్రాంగణం వద్ద రాజ్యంగా నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేదర్, ప్రధాని నరేంద్రమోదీ చిత్రపటాలతో రైతులు ధర్నాలో కూర్చున్నారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. తమ ఉద్యమాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్న కొందరు మంత్రుల తీరును తప్పుబట్టారు. రాజధాని కోసం ఐధేళ్ల క్రితం తమ భూములను ఇస్తున్నప్పుడు ప్రతిపక్షంలో వున్న ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కమాట కూడా మాట్లాడకుండా.. తమకు సమతమని చెప్పి ఇప్పుడు తమ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందని మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more