రెండక్షరాల విద్యతో సమస్త పుడమినే ఏలవచ్చు .. అటువంటి విద్య అందరికి అందాలని .. దాని ప్రాముఖ్యత ప్రతి ఒక పేదరిక బిడ్డ తెలుసుకోవాలి.. .. చదువు అనేది పంచే కొలది పెరుగును..అంతేకాని పంచే కొలది తరగదు,తరగని సంపద అంటే మనకు నేడు మిగిలింది మనకు చదువు మాత్రమే.. .... మంచిగా చదివితే మంచి ఉద్యోగం లభిస్తుంది.. కానీ చదువుకున్న స్థోమత లేని పేదవాడి పరిస్థితి ఏంటి, చదువుకోవాలని ఉన్న చదవలేని తలరాత .. అందుకే మన ప్రభుత్వం సర్కార్ పాఠశాలల ను ప్రవేశ పెట్టింది ఉచితంగా చదువును అందిస్తున్నారు.. .కానీ నేటి పోటీ ప్రపంచంలోని టెక్నాలజీ ,విజ్ఞాన్ని అందుకోవాలంటే మనకు ఆంగ్ల భాష ప్రప్రథంగా మారింది.. .. నేటి ఆధునిక యుగంలో ఆంగ్ల భాష కీలకమైనది ఉద్యోగ అవకాశాలు రావాలన్నీ భాష పై పట్టు అవసరం.. . అందుకే దీని గ్రహించిన మన అమరావతి రాజధాని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ రెడ్డి గారు సర్కార్ బడులలో కూడా ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టాలని ఉత్తమ ఆలోచన చేసి దాని శ్రీకారం కై కృషి చేస్తున్నారు.. అంతే కాక కార్పొరేట్ పాఠశాలల కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని భావించారు .
గురువారం నాడు అయన ప్రకాశం జిల్లా ఒంగోలు లో మన బడి “ నేడు - నాడు “ కార్యక్రమాన్ని నిర్వహించారు.. పది సంవత్సరాల తర్వాత మన పోటీ ప్రపంచంలో మెలగాలన్న మనకు కనీస ఆంగ్లం వచ్చి ఉండాలి .. ఆ ఆధునిక ప్రపంచ సరిహద్దులో తిరుగాడాలన్న తెలుగు భాష ఒకటే సరిపోదు .. ఆంగ్ల విద్య లో కొంచెం అయినా పట్టు ఉండడం మంచిందని భావించారు.. మన తల రాతను మనమే మనకు తగిన విధంగా మార్చులోవాలి అలానే తమ యొక్క పెద్దరికాన్ని మార్చడానికి ఉన్న ఏకైక ఆయుధం మనకు చదువు అందుకే దాని వెంట నడవాలి..
కొన్ని ప్రభుత్వ పాఠశాలల తీరు మరి వింతగా ఉంటుంది.. పాఠాలు చెప్పడానికి ఒక ఉపాద్యాయుడు కూడా ఉండడు ..అవన్ని మారాలి. భవిష్య ప్రణాళికకు మన వంతు కృషి చెయ్యాలి.. ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టె క్రమంలో ఎన్నో సవ్వాళ్లు ఉంటాయని వాటన్నింటిని ఎదురుకొని ముందుకు నడుస్తాం అని వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు..
గత ప్రభుత్వం పాఠశాలల మర్మతులకి 20 కోట్ల రూపాయాలను ఖర్చు పెట్టిందని అది అసలు ఏం సరిపోతాయని ప్రశ్నించారు,, శిధిల వ్యవస్థలో ఉన్న పాఠశాలల ను కార్పొరేట్ బడులుగా మార్చాము.. సుమారు 15750 పాఠశాలకు శ్రీకారం చుట్టాము .. వీటిని జూన్ జులై నాటికీ పనులు పూర్తి చేసి “ నాడు - నేడు “ ఫొటోలను బడి ముందు ఉంచుతామని అన్నారు.
రాష్త్ర అటవీ,పర్యావరణ,విద్యుత్ శాఖ మంత్రి బలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ గతం లో జగన్ జనరంజక పాలనా చేస్తే తాను సినిమాలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు,, నేడు అయన సినిమాలు తీసుకుంటున్నారు అంటే జగన్ పాలన జనరంజకంగా ఉందని అంగీకారించినట్లే కదా అని వ్యాఖ్యానించారు.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడుతూ కేంద్రం ప్రతి ఒకరికి విద్య అని చట్టం తెచ్చి పెట్టినది “ రైట్ టూ ఎడ్యుకేషన్ “ ప్రవేశం పెట్టి దేశానికి ఆదర్శం,గా జగన్ నిలిచారని ప్రసశంసించారు..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more