తెలంగాణలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తన భూమి సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఓ రైతు ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ పోసి అత్యంత పాశవికంగా సజీవ దహనం చేసిన ఘటనను మర్చిపోకముందే.. పోరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలో కిరోసిన్ పోసుకుని అత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడపలోని కొండాపురంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
కొండాపురంమండలంలోని దత్తాపురంకు చెందిన బుడిగ ఆదినారాయణ తన భూమికి సంబంధించి సమస్యపై ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాడు. ఎన్నో పర్యాయాలు తన భూసమస్యను పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, అయినా తన సమస్య అపరిష్కృతంగానే వుందని అవేశానికి లోనైన ఆయన తన వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే చుట్టు పక్కల ఉన్న జనాలు అడ్డుకొని ఆపారు.. అతడ్ని బయటకు తీసుకొచ్చి నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది. తన భూమికి సంబంధించిన సమస్యపై ఎమ్మార్వోను కలిసినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు
కొండాపురం మండలంలోని బుక్కపట్నంలో ఆదినారాయణ కుటుంబానికి 122 సర్వేనంబర్ లో 10.94 ఎకరాల డీకేటీ భూమి ఉంది. ఈ భూమిలో 3.50 ఎకరాలు అదే గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి గండికోట ప్రాజెక్టు కింద ముంపు పరిహారం అందుకున్నాడు. ఇక మిగిలిన భూమిపై చాలా ఏళ్లగా వివాదం నడుస్తోంది. ఈ భూమిలో 3.5 ఎకరాలు తన తండ్రి పేరు మీద ఉందని దానిని తన తల్లి పేరుకు మార్చాలని అధికారుల్ని కలిసి వినతిపత్రం ఇచ్చాడు.. కోర్టును ఆశ్రయించాడు. 1989 నుంచి ఆ భూమి తన తండ్రి పేరుపై ఉందని చెబుతున్నాడు. తన సమస్యపై ఎమ్మార్వో స్పందించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే ఆదినారాయణ తెలంగాణ అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో జరిగిన ఘటనను అసరాగా చేసుకుని పక్కా పథకం ప్రకారం ఇలా చేశాడని రెవెన్యూ కార్యాలయం సిబ్బంది అరోపిస్తున్నారు. ఆదినారాయణ చెబుతున్న భూమికి సంబంధించిన కేసు కోర్టు పరిధిలో ఉందని తహశీల్దార్ చెబుతున్నారు. అది డీకేటీ భూమి అని.. ఆ భూమికి ఆదినారాయణ నకిలీ పాసు పుస్తకం తయారు చేసుకున్నాడంటున్నారు. ఆ పొలంపై ఆదినారాయణకు ఎలాంటి హక్కులు లేకున్నా అధికారులను బెదిరిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పుకొచ్చారు. అందుకే ఆ భూమిని ఆన్ లైన్ చేయలేదని వివరణ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more