Modi govt good news to Andhrites అంధ్రప్రదేశ్ స్థానికతను మరో రెండేళ్లు పెంచిన కేంద్రం..

Central government extends ap local notification for two more years

Telanganites, Narendra Modi, Locals, Andhrites, localites, CM YS Jagan, TDP, YSRCP, andhra pradesh, Politics

PM Modi Government delivers Good News to Andhra pradesh people who are residing in Telanagna, by extending the localites notification to another two more years.

అంధ్రప్రదేశ్ స్థానికతను మరో రెండేళ్లు పెంచిన కేంద్రం..

Posted: 10/12/2019 09:45 AM IST
Central government extends ap local notification for two more years

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా వేరుపడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా కొనసాగుతూ ఐదేళ్ల కాలం ముగిసిన తరుణంలో.. అందరూ ఊహించినట్టే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు విడిపోయినా సోదరబావంతో తాము ఒక్కటనే చాటుతున్నారు. అయితే రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తరుణంలో తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ వాసులకు ఆ రాష్ట్రానికి వెళ్లి స్థిరపడాలని భావిస్తే వారికి స్థానికత కల్పించే ప్రకియను కూడా అప్పట్లో కేంద్రం చేపట్టింది.

అయితే పరిస్థితుల ప్రభావం చేతనో, లేక మరే కారణం చేతనో ఏపీకి వెళ్లి స్థిరపడాలని భావించినా, వెళ్లలేకపోయిన వారికి కేంద్ర సర్కారు శుభవార్తను చెప్పింది. ఇక ఇప్పుడు తాము ఏపీలోకి వెళ్లి స్థరపడాలని భావించేవారికి అక్కడ స్థానికత గుర్తింపు కూడా లభించనుంది. ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి స్థానికత కల్పించేందుకు ఇప్పటివరకూ ఉన్న ఐదేళ్ల గడువును ఏడేళ్లకు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.

కేంద్ర హోమ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గెజిట్ లో ప్రచురించింది. ఇటీవల జగన్ న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు గడువును పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. జగన్ కోరిక మేరకు మోదీ స్వయంగా హోమ్ శాఖకు స్థానికత గడువును పెంచాలని సూచించినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanganites  Narendra Modi  Locals  Andhrites  localites  CM YS Jagan  TDP  YSRCP  andhra pradesh  Politics  

Other Articles