godess kanakadurgadevi in Sri Annapurna Devi avatar శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో కనకదుర్గ అమ్మవారు..

Sri kanaka durga devi atop indrakeeladri in sri lalitha tripura sundari devi avatar

Dussehra, Sri Kanakadurga temple, Goddess Durga, Sri Lalitha Tripura Sundari Devi, Sri Annapurna Devi darshan, Indrakeeladri, stanacharyulu, temple chief priest, YS Jagan Mohan Reddy, devotees, Andhra pradesh

As part of nine-day long Navratri festival celebrations at Sri Kanakadurga temple atop Indrakeeladri hill today Goddess Durga will appear as Sri Lalitha Tripura Sundari Devi on the Fifth day of the nine-day festival. The devotees are being allowed to take darshan from 3 am onwards.

శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో కనకదుర్గ అమ్మవారు..

Posted: 10/03/2019 09:37 AM IST
Sri kanaka durga devi atop indrakeeladri in sri lalitha tripura sundari devi avatar

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ వేడుకల్లో  శ్రీ కనకదుర్గ అమ్మవారు ఇవాళ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శరన్నవరాత్రి వేడుకలలో తొమ్మిది రోజులు తోమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చే దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. నవరాత్రి వేడుకలలో వివిధ అవతరాల్లోని కొలువయ్యే దుర్గమ్మ దర్శంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు నలుమూలల నుంచి ఇంద్రకీలాద్రికి చేరకుంటున్నారు.

ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు అక్టోబర్ 3, గురువారం నాడు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా వేంచేసి తన భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు, దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్ర అతిష్టాన దేవతగా లతిత త్రిపురసుందరిని ఆరాధిస్తారు.

శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతిదేవీ ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో, వాత్సల్య జితోష్నలను చిందిస్తూ భక్తులపై కరుణకటాక్షాలను కురిపిస్తోంది అమ్మావారు. కుడి చేతిలో చెరుకు గడను చేత పట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు.

దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను సిద్ధింపజేసే లలితా త్రిపుర సుందరీ శ్రీవిద్యాస్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమార్చనకు సువాసినులకు మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారిని.. శ్రీ చక్ర కుంకుమార్చనతో అడపడచులు పూజిస్తారు. లలితా అష్టోత్తర శతనామావళిని పఠిస్తారు. ‘‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్రే నమః’’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చెయ్యాలి.

లలితా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకోటానికి భక్తులు వేకువజాము నుండే ఇంద్రకీలాద్రికి బారులుతీరారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. నాల్గవ రోజున అన్నపూర్ణ దేవిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. నిన్న ఒక్క రోజునే ఇంద్రకీలాద్రి ఆలయానికి 35.56 లక్షల అదాయం టికెట్లు, ప్రసాద విక్రయాల ద్వారా సమకూరిందని ఆలయవర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles