మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో అవకతవకలకు పాల్పడటంతో పాటు వాటి నిధులను దారిమళ్లించారన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభియోగాలపై వివరణ ఇచ్చేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. అయితే ఆయన నిధులు మళ్లించడంతో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగాలు మోసిన ఈడీ.. ఆయనకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు, అంతేకాదు విచారణకు హాజరుకావాలని కూడా ఎలాంటి సమన్లు పంపలేదు. అయినా తనపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఎన్సీపి అధినేత శరద్ పవార్ తానే స్వయంగా ముంబైలోని ఈడీ కార్యాలయానికి వస్తానని చెప్పారు.
అయితే ఈ విషయంలో కాసింత మిమాంసలో పడిన ఈడీ.. ఇప్పడే కాదని.. సమయం వచ్చినప్పుడు తామే పిలుస్తామని కూడా కబురు పంపింది. అయినా తనపై అభియోగాలు మోపిన నేపథ్యంలో తాను విచారణకు కాదు వివరణ ఇస్తానని అభియోగాలోంటే అధికారులే చెప్పాలని శరద్ పవార్ అన్నారు. ఎన్సీపీ అధినేత పవార్ ఈడీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకునే అవకాశముందని భావించిన పోలీసులు ముంబైలో ఆంక్షలను విధించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడరాదని ఆంక్షలు విధించారు.
వాస్తవానికి శరద్ పవార్ కు ఇంత వరకు ఈడీ సమన్లు పంపలేదు. కానీ, మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో, రానున్న రోజుల్లో ప్రచారానికి సంబంధించి బిజీ కాబోతున్న నేపథ్యంలో... ఆయనే తనంతట తానుగా ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు సెక్షన్ 144 విధించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నట్టు శరద్ పవార్ నిన్న ట్వీట్ చేశారు. ఈడీ కార్యాలయం వద్దకు ఎవరూ రావద్దంటూ పార్టీ శ్రేణులకు ఆయన విన్నవించారు.
#WATCH Mumbai Police uses drone for security surveillance at Ballard Estate where Section 144 is imposed. NCP Chief Sharad Pawar will visit ED office today for their investigation in the money laundering case in which he has been named. pic.twitter.com/ttWA4wf33h
— ANI (@ANI) September 27, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more