బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని భారత్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సముద్రంలోని ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయవ్య ప్రాంతంలో క్రమంగా బలపడుతోందని దీంతో రేపు ఉదయానికి ఇది వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 7.6 కి. మీ ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు.
ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో సముద్ర మాట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. వీటి ఫలితంగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని అధికారులు తెలిపారు.
ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపు ప్రయాణం చేసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. అల్పపీడనం, నైరుతీ రుతుపవనాలు క్రియాశీలకంగా మారడం వల్ల ఏపీలోని 75 శాతం ప్రాంతాల్లో మూడు రోజులపాటు విస్తారంగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. కోస్తా ఆంధ్ర, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య కోస్తా, ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 6 సెంటీమీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్లు, ఒకటి రెండు చోట్ల 11 నుంచి 20 సెంటీమీటర్లు వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి విడుదల చేసిన బులిటెన్ లో వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more