బెయిల్ నిమిత్తం కోట్ల డీల్ కేసులో నిందితుడు, మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి నాగమారుతి శర్మ కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. తనకు బెయిల్ ఇస్తే, రూ. 40 కోట్లను ఇస్తామని నిందితుడు ఆశ్రయించాడని, తనకు వచ్చిన ఆఫర్ ను నిరాకరించానని ఆయన కోర్టులో సాక్ష్యం ఇవ్వడంతో గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసులో పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కన్నట్లయింది. నిన్న స్థానిక ఏసీబీ కోర్టు విచారణకు హాజరైన, నాగమారుతి శర్మ ఈ కేసులో ఏ-4 సాక్షిగా ఉన్న సంగతి తెలిసిందే.
గతంలో ఓబులాపురం మైనింగ్ కేసులో జనార్దనరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన వేళ, బెయిల్ కోసం సీబీఐ కోర్టు మరో న్యాయమూర్తి, పట్టాభి రామారావుకు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేయగా, దానిపై ఇప్పుడు ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. నాచారం ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ యాదగిరి మధ్యవర్తిగా బేరం సాగగా, నాటి సీబీఐ కోర్టు జడ్జి పట్టాభిరామారావు జనార్దన రెడ్డికి బెయిలు మంజూరు చేశారు. అంతకన్నా ముందు మరో న్యాయమూర్తి, నేటి సాక్షి నాగమారుతి శర్మతోనూ బేరం జరిగింది.
అయితే, నాగమారుతి శర్మ డబ్బులు తీసుకుని బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. మొత్తం ఉదంతం బయటకు పొక్కిన తరువాత, పట్టాభి రామారావుపై కేసు నమోదైంది. అప్పట్లో సీబీఐ కోర్టు న్యాయమూర్తిగా ఉన్న శర్మను ఏసీబీ అధికారులు నాల్గవ సాక్షిగా చేర్చారు. గాలి జనార్దన రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే, రూ.40 కోట్లు ముట్టజెప్పుతామని తనకు ఆఫర్ వచ్చిందని, దాన్ని తాను అంగీకరించలేదని ఏసీబీ కోర్టులో సోమవారం నాడు ఆయన వాంగ్మూలం ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more