పోలీస్ అంటే ఎంతో పవర్ ఫుల్.. ఆ పవర్ రావడానికి వారి విధి నిర్వహణ కూడా ఒక కారణం. అయితే బ్రిటీషు కాలం నాడు రూపోందిన విధివిధానాలు, నియమనిబంధనలతో వారు ఇప్పటికీ డ్యూటీలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని దశాబ్దాలుగా తమకు కూడా వారానికి ఒక్క రోజు వారాంతపు సెలవు ఇవ్వాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు ఈ డిమాండ్ ను విన్న ప్రభుత్వాలు వారి విన్నపాన్ని అటకెక్కించాయే తప్ప.. అమల్లోకి మాత్రం తీసుకురాలేదు. అయితే తన పాదయాత్ర సందర్భంగా కానిస్టేబుళ్ల సమస్యలను కూడా సానుకూలంగా విన్న వైఎస్ జగన్ వారికి హామిఇచ్చారు.
దీంతో ఏళ్లకు ఏళ్లుగా వున్న డిమాండ్ ఈ నెల 19 నుంచి అమల్లోకి రానుండటంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అన్ని వార్గాల ప్రజలను, రైతులను, ఉద్యోగులను, ఆకట్టుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇక తాజాగా పోలీసుల వంతు వచ్చింది. పోలీసులకు కానిస్టేబుల్ మొదలుకుని సిఐ వరకు అందరికీ వారాంతపు సెలవు అమల్లోకి రానుంది. ఈ విధానం జూన్ 19వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. పోలీసుల డైరీలో వీక్లీ ఆఫ్ అనే పదమే ఎరుగరు.. కానీ ఇప్పుడు ఆ డైరీలో వారాంతపు సెలవు అన్న పదం జతకలవనుంది.
కేవలం వార్షిక సెలవులతో మాత్రమే సిక్ లీవ్, క్యాజువల్ లీవ్స్, ఎర్న్ లీవ్స్ ఉండేవి. కానీ జగన్ వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చారు. అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, 22మంది పోలీసు ప్రతినిధులతో కూడిన కమిటీని జూన్ 4న ఏర్పాటు చేశారు. వీక్లీ ఆఫ్ అమలు చేస్తే ఎదురయ్యే ఇబ్బందులను ఈ కమిటీ వారం రోజులపాటు అధ్యయనం చేసింది. జూన్ 10న మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సవాంగ్తో కమిటీ సమావేశమై వీక్లీ ఆఫ్ అమలుకు నిర్ణయించారు. ఇందుకు సిబ్బంది కొరత ఇబ్బంది కాదని కూడా తేల్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more