బీఎస్పీ అధినేత మాయావతి అందరికీ ఆదర్శమని, ఆరాచక శక్తులు మాటువేసిన ఉత్తర్ ప్రదేశ్ లో అన్నింటినీ ధైర్యంగా ఎదురొడ్డి పోరాడిన ధీరవనిత ఆమె అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. ఒక పోస్టల్ క్లర్ కూతురిగా వున్న అమె నాలుగు పర్యాయాలు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారంటే అమె భావజాలాన్ని అక్కడి ప్రజలు ఎంతగా అదరించారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. దేశంలో ప్రస్తుతం బీఎస్పీ పార్టీ లేని రాష్ట్రం లేదని, ఇక ఆ పార్టీ కార్యకర్తలు లేని గ్రామం కూడా లేదని పవన్ పేర్కోన్నారు.
రాజకీయాల్లోకి తనలాంటి వాడు వస్తేనే ఇబ్బందులు తప్పడం లేదని, ఇక అలాంటి తరుణంలో అమె ఒంటి చేత్తే పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించారంటే అమెలో ఎంత పట్టుదల, అకుంఠిత దీక్ష వుందో అర్థమవుతుందని అన్నారు పవన్. ఈ సందర్భంగా అమెపై ప్రశంసలు కురిపిస్తూ.. మాయావతిని ఆకాశానికి ఎత్తేసారు. విజయవాడలోని ఎంబీపీ స్టేడియంలో జనసేన పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఓ సామాన్య వ్యక్తి సీఎం కావడం చాలా కష్టంతో కూడుకున్న పని అని, అలాంటిది, మాయావతి ఇప్పటికే నాలుగుసార్లు సీఎం అయ్యారని కొనియాడారు. అంబేద్కర్, కాన్షీరామ్ లాంటి గొప్ప వ్యక్తులు సామాజిక వ్యవస్థలో మార్పులు తెచ్చారని అన్నారు. నాలుగు సార్లు సీఎం గా చేసిన వ్యక్తి మాయావతి తనకు స్ఫూర్తి అని, నరేంద్ర మోదీ కూడా మాయావతి నుంచి స్ఫూర్తి పొందిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో బీఎస్పీ కార్యకర్తలు లేని గ్రామం లేదని అన్నారు. తమ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే బేడీలు వేసి రోడ్డుపై నడిపించిన ఆదర్శ మహిళ మాయావతి అని కొనియాడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more