ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ప్రజానాడి టీడీపీ పక్షానికే మద్దుతుగా వుందని, ఆ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఏబీపీ చానల్ కోసం 'లోక్ నీతి-సీఎస్డీఎస్' నిర్వహించిన ఈ సర్వేలో టీడీపీకి 126 నుంచి 135 అసెంబ్లీ సీట్లు లభిస్తాయని, 18 నుంచి 22 లోక్ సభ స్థానాలు దక్కుతాయని అంచనా వేశారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ గత ఎన్నికల మాదిరే ఈసారి కూడా ద్వితీయస్థానానికే పరిమితం అవుతుందని, ఆ పార్టీకి 45 నుంచి 50 అసెంబ్లీ స్థానాలు, 3 నుంచి 5 లోక్ సభ స్థానాలు దక్కుతాయని సర్వే చెబుతోంది.
మొత్తంమ్మీద టీడీపీకి తిరుగులేని మెజారిటీ ఖాయమని 'లోక్ నీతి-సీఎస్డీఎస్' సర్వే పేర్కొంది. కాగా, ఓటింగ్ శాతంపైనా సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. టీడీపీకి 46.2 శాతం ఓట్లు, వైసీపీకి 37.2 ఓట్లు పోలవుతాయని సర్వే నివేదికలో తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 2 నుంచి 5 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందట. మార్చి 11 నుంచి 19వ తేదీ నడుమ అన్ని వయసుల ఓటర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే చేపట్టారు.
ఆ ఫలితాలన్నీ ఉత్తవే.. సర్వే చేయనేలేదన్న సంస్థలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తుందని లోక్నీతి-సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడయినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ప్రచారంపై ఆ సంస్థ స్పందించింది. ఈ సర్వేతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అసలు ఏపీలో ఎలాంటి సర్వే చేపట్టలేదని పేర్కొంది. ‘తాము ఏపీలో ఎలాంటి సర్వే చేపట్టలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వారల్లో నిజం లేదని స్పష్టం చేసింది. తమ సర్వే పేరుతో ప్రచారమవుతన్నదంతా ఫేక్ అని, పూర్తిగా అసంబద్ధమైనదని’ అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది.
Lokniti-CSDS has NOT done any survey in the State of Andhra Pradesh. What is being shared on social media is FAKE and complete rubbish!
— Lokniti-CSDS (@LoknitiCSDS) April 1, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more