పలువురు ప్రముఖ సినీ, బుల్లితెర నటులు ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఉదయం లోటస్ పాండ్ కు చేరుకున్న సినీనటుటు జీవిత, రాజశేఖర్ లు జగన్ ను కలసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలకు ముందే తనకు గతంలో జగన్ తో ఏర్పడిన అభిప్రాయబేధాలను తొలగించు కోవాలని భావించి, ఓ మారు కలుద్దామని వచ్చామని, జగన్ ఎంతో మారిపోయారని, ఒకప్పుడు తాను చూసిన జగన్ వేరు, ఇప్పుడు చూసిన జగన్ వేరని హీరో రాజశేఖర్ వ్యాఖ్యానించారు.
ఈ ఉదయం తన భార్య జీవితతో కలిసి లోటస్ పాండ్ కు వచ్చి, జగన్ తో చర్చించి, వైసీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సూపర్ సీఎం అనుకుంటే, ఆయన్ను దించేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి సూపర్, డూపర్ సీఎం అనిపించుకున్నారని, అంతకుమించి జగన్ చేయగలడన్న నమ్మకం తనకుందని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకంతో పాటు రైతులకు వైఎస్ ఎంతో మేలు చేశారని, ప్రజల మనసుల్లో ఉండిపోయారని వ్యాఖ్యానించారు. జగన్ మామూలు బిడ్డ కాదని, పులిబిడ్డని చెప్పారు. జగన్ తమపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలను చూపించారని పొగడ్తలు కురిపించారు.
ఆ తరువా టీవీ యాంకర్, బిగ్ బాస్ 2 కంటెస్టంట్ శ్యామల తన భర్త నర్సింహారెడ్డితో కలసి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ, వైసీపీ కుటుంబంలో కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జగన్ అన్నను చాలా కాలంగా పరిశీలిస్తున్నానని.. ఆయన విధివిధానాలు, ఆయన చేస్తున్న మంచి పనులు తనకు ఎంతో నచ్చాయని తెలిపారు. అన్న చేస్తున్న మంచి పనుల్లో స్వయంగా పాలుపంచుకోవాలనే ఈరోజు వైసీపీలో చేరామని చెప్పారు.
జగన్ అన్న చెబుతున్న నవరత్నాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, మద్యపాన నిషేధం, ఆరోగ్యశ్రీ పథకాలు తమకు ఎంతో నచ్చాయని చెప్పారు. తనకు సపోర్ట్ గా తన భర్త కూడా వచ్చారని తెలిపారు. తాము కూడా వైసీపీ ప్రచారంలో పాలుపంచుకోబోతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు వైసీపీకి ఓటు వేసి ఘన విజయాన్ని అందించాలని కోరారు. ఆ తరువాత అమె భర్త నర్సింహారెడ్డి మాట్లాడుతూ, ఏపీ ప్రజలందరితో పాటు తాము కూడా జగన్ అన్న కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. జగన్ అన్నతో కలసి నడవాలనుకుంటున్నామని చెప్పారు.
అనంతరం మరో సినీనటి మరో సినీ నటి హేమ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా హేమను జగన్ ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలను అడిగి తెలుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డి స్థాపించిన సమైఖ్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరోవైపు ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి... ఉపాధ్యక్షురాలిగా గెలుపొంది, సత్తా చాటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more