పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల షెడ్యూల్డు విడుదల కావడంతోనే హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో గల తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ నివాసాసికి వచ్చినా.. తనను కలిసేందుకు జగన్ అపాయింట్ మెంట్ లభించకపోవడంతో.. ఆయన మూడు రోజులుగా ఎదరుచూపులు చూశాడు. మూడు రోజులు పడిగాపులు కాసినా ఆయనకు అధినేత జగన్ నుంచి పిలుపు రాకపోవడంతో.. విషయం మీడియాకు తెలిసింది. దీంతో సునీల్... లోటస్ పాండ్ నుంచి నిరాశగా వెనుదిరిగారు.
ఇలా వెళ్లిన సునీల్ తాజాగా ఓ బెదిరింపు వీడియో కాల్ ను తమ పార్టీ అధినేతకు పంపాడు. తనకు పూతలపట్టు అసెంబ్లీ టికెట్ అవసరం లేదని.. అయితే తనపై కొందరు వేస్తున్న నిందలు భరించలేక తాను జీవితాన్ని చాలించుకుందామని భావిస్తున్నానని.. తానే ఏ లోకంలో వున్నా తనను గుర్తుతెచ్చుకుంటే చాలునని అన్నారు. తనను అదరించి.. డాక్డరని గౌరవించి ఒకసారి పూతలపట్టు నియోజకవర్గం ప్రజలకు సేవ చేసి అవకాశం ఇచ్చారన్నారు.
తనకు రాజకీయాలతో అవసరం లేదని.. తాను సంపాదించుకుని బతకగలనని కూడా అన్నారు. తనకు ఇద్దరు పిల్లలని, వారికి తాను వృత్తిరిత్యా జీవితాలను ఇవ్వగలనని చెప్పారు. ఇక టీడీపీ వాళ్లకు కూడా తన గురించి తెలుసునని.. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా తాను వారి పక్షానికి వెళ్లలేదని అన్నారు. అయితే కొంతమంది మాత్రం తనపై కక్షగట్టి అసత్యప్రచారాలు చేయడం తనను బాధిస్తుందని అన్నారు. ఈ నిందను బాపుకునేందుకే తాను ఆత్మహత్య చేసుకుంటానని వీడియోలో పేర్కోన్నాడు.
కాగా, ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనను చూసినా... పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యే సునీల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో విజయం సాధించిన సునీల్ కు ఈ సారి టికెట్ దక్కడం అనుమానమే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... ఆయనకు వైసీపీ అధినేత అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై చర్చ మొదలైన నేపథ్యంలో తాజాగా ఆయన ఈ బెదిరింపు వీడియోను విడుదల చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more