మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున పులివెందులలోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన బౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు వివేకానంద రెడ్డికి హత్యేనని తేల్చారు. ఆయన శరీరంపై ఏడు కత్తిపోట్లు వున్నాయని వైద్యులు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పుడు హత్య కేసుగా దానిని మార్చి దర్యాప్తును వేగిరం చేస్తున్నారు.
నిన్న రాత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గోని మంచి యాక్టివ్ గా వున్న వివేకా ఇవాళ ఉదయం నిద్ర లేచి బయలకు రాకపోవడంతో.. వెళ్లి చూసిన అతని పీఏ కృష్ణారెడ్డి.. బాత్ రూమ్ లో వైఎస్ వివేకానందరెడ్డి విగతజీవిగా పడి ఉండటం గమనించి పోలీసులకు పిర్యాదు చేశాడు. ఆయన తల, చేతులకు బలమైన గాయాలు ఉండటంతో మృతి వెనుక అనుమానాలు వ్యక్తం చేశాడు. అయితే ఆయన అనుమానాలే నిజమయ్యాయి. వివేకానందరెడ్డికి మృతదేశానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చారు. దీంతో లభించిన ఆదారాలతో హత్యకేసుగా నమోదు చేస్తామని ఎస్సీ రాహుల్ తెలిపారు. ఇందుకోసం కర్నూలు నుంచి ఫోరెన్సీక్ష నిపుణులను పులివెందులకు రప్పిస్తున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని భావిస్తున్నామని ఎస్సీ తెలిపారు. హత్యా స్థలంలో నేరస్థుల ఫింగర్ ఫ్రింట్స్ లభించాయని తెలిపారు. అయితే వివేకాను ఎవరు చంపి వుంటారన్న విషయమై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. రాత్రి 11.30 నిమిషాల నుంచి తెల్లవారు 5 గంటల మధ్యలో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నామని ఎస్పీ రాహుల్ అన్నారు, లభించిన ఆధారాలతో విచారణ చేపడతామని అన్నారు. కాగా వివేకానంద రెడ్డి నుదిటిపై రెండు లోతైన గాయాలు వున్నాయిని.. తల వెనుక భాగంలోనూ లోతైన గాయం వుందని, చేతులపైన, తొడపైన కూడా గాయాలు వున్నాయని పోలీసులు తెలిపారు.
వైఎస్ వివేకా చివరి ఎన్నికల ప్రచారం వైరల్
వైఎస్ వివేకా చివరిసారిగా నిన్న చేసిన ఎన్నికల ప్రచారం తాలుకూ దృశ్యాలు ఆయన హత్య నేపథ్యంలో నెట్టింట్లో వైరల్ గా మారాయి. చనిపోవడానికి ముందు రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు ప్రజలు నుంచి ఘనస్వాగతం లభించింది. పులివెందులలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనేకమంది ప్రజలతో మమేకమయ్యారు. చివరిసారిగా వివేకానంద నిర్వహించిన ఎన్నికల ప్రచారం తాలుకు దృశ్యాలను ఇప్పుడు ఆ పార్టీ నేతలతో పాటు తటస్థులు కూడా షేర్ చేసుకోవడంతో అవి వైరల్ అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more