ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జనసేన పార్టీ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలతో పాటు మధ్య తరగతి ప్రజల సమస్యలను వెలుగెత్తి చాటుతూ ముందుకు దూసుకెళ్తోంది. పార్టీ ఐదవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరంచుకుని క్రితం రోజున రాజమండ్రిలో లక్షలాధి మంది జనసైనికుల సమక్షంలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన మానిఫెస్టోలో కూడా మహిళలు, విద్యార్థులు, మత్స్యకారులు, రైతులతో పాటు బడగు, బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలకే ఎన్నికల హామీలను గుప్పించారు.
ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన సరిగ్గా 27 రోజులు మాత్రమే మిగిలివున్న వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి పవన్ నాంది పలికారు. కీలక రాజకీయ పొత్తుకు తెరలేపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఈరోజు ప్రకటించారు. యూపీలోని లక్నోలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ తో కలిసి మాయావతి మాట్లాడారు. ఇరుపార్టీల మధ్య సీట్ల పంపిణీపై అంగీకారం కుదిరిందని మాయావతి తెలిపారు.
Jana Sena Chief Pawan Kalyan after alliance with BSP: We would like to see Behen ji Mayawati ji as the Prime Minister of our country, this is our wish and our ardent desire. pic.twitter.com/HtF17cfi4T
— ANI (@ANI) March 15, 2019
త్వరలోనే పవన్ కల్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని అన్నారు. పవన్ కల్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు అభిలషించారు. మాయావతికి తాము మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ దేశానికి ప్రధానిగా మాయావతిని చూడాలనుకుంటున్నామని.. అది తమ పార్టీ బలమైన అభిలాష అన్నారు. దేశానికి దళిత నేత ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమన్నారు.
అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరముందన్నారు. ఏపీలో బీఎస్పీకి ఎన్నిస్థానాలు కేటాయించేది త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ..పొత్తులపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిపారు. ఏపీ,తెలంగాణలో జనసేనతో సీట్ల సర్దుబాటు దాదాపు ఫైనల్ అయినట్లు తెలిపారు.
కాగా, జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లను బీఎస్పీకి కేటాయించిందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే అటు వామపక్షాలతో పాటు ఇటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాన్.. అపారమైన రాజకీయ అనుభవం వున్న నేతగా అడుగులు వేస్తూ.. ప్రత్యర్థి పార్టీలను ఖంగుతినిపిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
BSP Chief Mayawati: Jana Sena and BSP will fight together in Andhra Pradesh and Telangana; seats have almost been finalized. pic.twitter.com/t7UbHOw8pn
— ANI (@ANI) March 15, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more