పాకిస్థాన్ తో యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల ముందే చెప్పారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో తనపై బీజేపి నేతలు చేస్తున్న విమర్శలపై ధీటుగానే స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చిత్తూరులో ఆదివారం జనసేన కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన ఆయన బీజేపీ నేతలపై మండిపడ్డారు. దేశభక్తిపై బీజేపీకి ఎవరూ పేటెంట్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.
జనసేన పార్టీ సమావేశాల్లో మాత్రమే జాతీయ జెండాలు కనిపిస్తాయని, భారత్ మాతాకీ జై అనే నినాదాలు వినిపిస్తాయని అన్నారు. తన దేశభక్తిని ఎవరి వద్దా నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆళ్లగడ్డలో తాను అన్న మాటలు.. అంతకుముందు అనేక పతిక్రలలో పతాకశీర్షకలతో కూడా వచ్చాయని అన్నారు. అయితే అవి తన మాటలు కాదని, రాజకీయ పరిశీలకులు, విశ్లేషకుల మాటలని తాను వివరణ కూడా ఇచ్చానన్నారు. తన వ్యాఖ్యలు పాకిస్థాన్ పత్రికల్లో వస్తాయని కలగనలేదని కూడా చెప్పారు.
అయితే వాటిని పట్టుకుని తన దేశభక్తిని శంకించడానికి మీరెవరంటూ బీజేపీ నేతలపై పవన్ విరుచుకుపడ్డారు. మైకుల ముందుకు వచ్చి దేశభక్తి అని తనపై అరోపణలు చేస్తున్న ఓ బీజేపి నేత.. తన దేశభక్తిని శంకిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అనుకోకుండా.. ఓ వ్యక్తిని ఢీకొడితే కనీసం ఆగకుండా వెళ్లిపోయిన ఈ నేత.. మచ్చకైనా మానవత్వంలేని ఈ నేత.. దేశభక్తి అని అంటున్నారని దుయ్యబట్టారు. తోటి మనిషి ప్రమాదం బారిన పడితేనే అగి అస్పత్రికి తీసుకెళ్లే తత్వం ఏక్కడ.. తన కారే ఢీకొట్టినా.. ఆగకుండా వెళ్లిన మానవత్వం లేని అలాంటి వ్యక్తులు ఎక్కడ.? అని ప్రశ్నించారు.
అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవపరం లేదు అంటూ బీజేపి నేత జీవీఎల్ నరసింహారావు ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం 1997లోనే వస్తుందని కొందరన్నారు. అంటే భవిష్యత్తు వారికి తెలుసనా? 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ, చంద్రబాబు, నేను కలిసి తిరుగుతున్నపుడు అవినీతి అంతం చేయాలంటే నోట్ల రద్దు అవసరమని అనుకున్నాం. అంటే నోట్ల రద్దు గురించి మాకు ముందే తెలిసిపోయినట్లా?. అని పనవ్ కల్యాణ్ ధీటుగా ప్రశ్నించారు.
అలాగే పాకిస్థాన్పై తాజాగా మెరుపు దాడుల విషయంలోనూ నేను గతంలో చెప్పిన మాటలను ఇప్పుడు వక్రీకరిస్తున్నారు. తాను ఆనాడు విశ్లేషకుల అంచనాలనే నేను ప్రస్తావించాను. తాను మాట్లాడే మంచి మాటలను మీడియాలో చూపించరు. ఒక మాటపై వివాదం రేగితే మాత్రం పక్కదారి పట్టిస్తూ పదేపదే చూపిస్తారు. చర్చలు పెడతారు’ అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more