దేశం విషయానికి ఎవరు వచ్చినా యావత్ భారతం ఐక్యంగా ఎదుర్కోంటుందని అంతా ముక్తకంఠంతో ఒక్కటిగా జీవిస్తాం.. ఒక్కటిగా పోరాడుతాం.. ఒక్కటిగా గెలుస్తామని నినదిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. సరిహద్దులో పాకిస్థాన్ చర్యల వల్ల అటు సైనికులకు గానీ, ఇటు దేశ ప్రజలకు గానీ ఆత్మస్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదన్నారు. ఇవాళ ఆయన ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’ అనే పార్టీ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు.
భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలతో తెగబడటం, పాకిస్థాన్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. నమో యాప్ ద్వారా 15,000 ప్రాంతాల నుంచి కోటి మందికి పైగా కార్యకర్తలతో మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగంగా మాట్లాడారు. ఉగ్రదాడుల ద్వారా భారత్ ను విడగొట్టడానికి పాక్ ప్రయత్నిస్తోందని మోదీ మండిపడ్డారు. ఇప్పుడు దేశ పౌరులందరూ సైనికుల్లా అలర్ట్ గా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దేశానికి సంబంధించిన ఎలాంటి పేక్ వార్తలు ప్రచారంలోకి వచ్చినా వాటిని నమ్మకూడదని ఆయన పిలుపునిచ్చారు.
దాయాధి పాకిస్థాన్ భారత్ ను ధైర్యంగా ఎదుర్కోనలేక.. భారతీయులను విడదీసేందుకు.. అస్థిర పరచడానికి ప్రయత్నాలు చేస్తుందని వాటిని తిప్పికోట్టాలని అన్నారు. మన అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ, దేశమంతా ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చి పాక్ దుష్ట ఆలోచనలను తిప్పి కొడుతోంది. ఇలాంటి సమయంలో భద్రతా బలగాల నైతిక స్థెర్యాన్ని దెబ్బ తీసేలా ఎవరూ వ్యవహరించకూడదు’ అని మోదీ అన్నారు. వారికి దేశప్రజలందరూ తమ అండదండలను అందించాలని కోరారు.
2014 ఎన్నికల సమయంలో ప్రజల కనీస అవసరాలు తీర్చడం ఎజెండాగా ఉండేదని.. ప్రస్తుతం దేశవాసుల కలలను సాకారం చేయడం ఎజెండాగా మారిందని నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధిలో భారత్ మరో స్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా అమరుల అంశం, పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసిన అంశాలను వాడుకోవటంపై విపక్షాలు ఖండిస్తున్నాయి. దేశానికి సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయం చేస్తారా.? అంటూ ప్రశ్నిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more