పాకిస్తాన్ ఆర్మీ చేతిలో బంధీగా ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆయనను పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణం విడుదల చేసిన పంపాలని ఆయన డిమాండ్ చేశారు. యుద్ధ ఖైదీలను హింసించరాదని, బందీగా చిక్కిన సైనికులను సురక్షితంగా వారి దేశాలకు అప్పగించాలని జెనీవా ఒప్పందం చెబుతోందని పవన్ గుర్తు చేశారు. పాకిస్తాన్.. జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని, అభినందన్ను భారత్కు అప్పగించాలని పవన్ డిమాండ్ చేశారు.
ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందని పవన్ అన్నారు. యుద్ధం జరిగితే ఇరువైపులా నష్టం వాటిల్లుతుందన్నారు. యుద్ధం ఎవరూ కోరుకోరని చెప్పారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో వింగ్ కమాండర్ అభినందన్ పాక్ చెరలో బందీగా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని జనసేన మనస్ఫూర్తిగా కోరుకుంటోందని పవన్ చెప్పారు. . యుద్ధం అంటూ జరిగితే.. భారత ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పారు.
ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి చొరబడి దాడికి యత్నించాయి. వెంటనే అప్రమత్తమైన భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు పాక్ విమానాలను తరిమికొట్టాయి. పాకిస్తాన్కు చెందిన ఓ విమానాన్ని కూల్చేశాయి. పాక్ విమానాలను తరిమికొట్టే క్రమంలో భారత్కు చెందిన మిగ్ 21 బైసన్ జెట్ పాకిస్తాన్ భూభాగంలో కుప్పకూలింది. అందులో ఉన్న వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ వెంటనే అభినందన్ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. ఆయనపై అక్కడ దాడి జరిగింది. అభినందన్ను తీవ్రంగా కొట్టి హింసించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more