దేశ రాజధాని న్యూఢిల్లీలోని కరోల్ భాగ్ ప్రాంతంలో సంభవించిన అగ్నిప్రమాదం ఏకంగా 17 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇవాళ తెల్లవారుజామున అంతా గాడనిద్రలో వున్న సమయంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటల్లో 17 మంది సజీవ దహనమయ్యారు. ఢిల్లీలోని కరోల్ భాగ్ ప్రాంతంలోగల అర్పిత్ ప్యాలెస్ హోటల్ లో ఈ తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
తెల్లవారు జామూన.. గాడ నిద్రలో వున్న హోటల్ లోని కస్టమర్లలో అత్యధికులు అగ్నిప్రమాదం కారణంగా ఉత్పన్నమైన పొగకు ఊపిరాడక కన్నుమూయగా, మరికోందరు నిద్రలోనే మంటలు వ్యాపించడంతో సజీవదహనమయ్యారు. కొందరు మాత్రం హోటల్ లో మంటలు వ్యాపించడంతో.. దాని వాసనకు లేచిన కస్టమర్లు తప్పించుకునేందుకు హోటల్ గదుల లోని కిటికీల నుంచి టెర్రస్ నుంచి కిందకు దూకారు. ఇలా ప్రయత్నించిన ఓ మహిళ, చిన్నారి కూడా దుర్మరణం పాలయ్యారు.
Spot visuals: 9 dead in the fire that broke out in Hotel Arpit Palace in Karol Bagh, earlier today. Rescue operation still underway. #Delhi pic.twitter.com/F2KNcozrZK
— ANI (@ANI) February 12, 2019
ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి నాలుగు గంటల పాటు 22 ఫైర్ ఇంజన్లు శ్రమించి.. సుమారు 50 మందిని రక్షించాయి. వీరిలో 15 మంది తీవ్ర గాయాలపాలుకాగా, వారిని చికిత్స నిమిత్తం అసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం మంటలైతే అదుపులోకి వచ్చాయిగానీ, భవనంలో చిక్కుకున్న వారి జాడ తెలియరాకపోవడంతో, ఫైర్ ఫైటర్స్ వారి కోసం గాలిస్తున్నారు. మొత్తం మూడు అంతస్తులుండే అర్పిత్ ప్యాలెస్ లో దాదాపు 70 మందికి పైగా బస చేసివుండగా, హోటల్ సిబ్బంది మరో 20 మంది వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నామని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more