తనను కలిసిన మహిళలు, యువతుల కురులు సర్దడం, వారితో సెల్ఫీలు దిగడం, బుగ్గలు నిమరడం మినహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు మరేమీ చేయడం చేతకాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపడచుల భద్రత, వారు ఎదుర్కోనే సమస్యలను పరిష్కారించడంతో పాటు వారిని రాజకీయాల్లో ఎదిగేందుకు గత ఐదేళ్లుగా ఆయన ఏం చేశాడని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రశ్నించి.. ప్రజాకంఠక ప్రభుత్వ నిర్ణయాలపై ఎప్పటికప్పుడు పోరాడాల్సిన జగన్.. ప్రతిపక్ష నాయకుడి హోదాలో గత ఐదేళ్లుగా సాధించిందేమిటని పవన్ నిలదీశారు.
అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని జగన్ తో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగబోదని అన్నారు. అవినీతిని ప్రశ్నించడంలో జగన్ పూర్తిగా దద్దమ్మలా మారిపోయారన్నారు. తన ఎమ్మెల్యేలతో కలసి అసెంబ్లీ నుంచి పలాయనం చిత్తగించారని ఆయన విమర్శించారు. అయన బాటలోనే నడుస్తున్న ఆయన ఎంపీలు కూడా తమ పదవీ కాలం ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా పార్లమెంటు నుంచి బయటకు వచ్చేశారని ఎద్దేవా చేశారు. జగన్ వైఖరి వల్లే చంద్రబాబు, లోకేశ్ దోపిడీ రాజ్యానికి అడ్డు లేకుండా పోయిందని పవన్ ఆరోపించారు.
రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కోనసీమలో గ్యాస్ ను దోచుకుని వెళుతున్నా చంద్రబాబు మిన్నకున్నారని ఆరోపించారు. చంద్రబాబు వంటి వ్యక్తుల నుంచి దక్షిణ భారత నినాదం వస్తుందనుకున్నానని, కానీ, ఆయన నాలుగేళ్ల పాటు మోదీ కొంగుపట్టుకుని తిరిగారని ఆరోపించారు. బీజేపీ హిందీ పార్టీ అయినప్పటికీ, తెలుగు భాషను చంపుకునే విషయంలో తాను రాజీ పడబోనని, హిందీని రుద్దుతామంటే అంగీకరించనని చెప్పారు.
కోనసీమ మహిళమణులు చూపిన ఆదరణ మరువలేనిదన్న పవన్ కోనసీమలో మూడు అడుగుల లోతులో గ్యాస్ లైన్లు వేసి ప్రాణాలను బలితీసుకుంటున్నా సీఎం, జగన్ లకు నోరు మెదపడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన గాలి విస్తుందన్న పవన్.. రానున్న ఎన్నికలలో తాము తప్పక అధికారంలోకి వస్తామని అన్నారు. తనకు సగటు మధ్యతరగతి ప్రజల కష్టాలతో పాటు పేదలు, బడుగుల కనీళ్లు వెనుక దిగులు కూడా అర్థమవుతుందని అన్నారు.
తనకు విప్లవ నాయకుడు చేగువిరా అంటే ఇష్టం.. క్యూబా విప్లవకారుడు నుండి ఎన్నో పాఠాలు నేర్చకోవచ్చన్నారు. పీడిత ప్రజలకు అండగా ఉంటాం.. కులమతాలకు జనసేన అతీతం అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఛీత్కారాలు ఎదుర్కొన్నాం.. అవమానాలు పడ్డాం.. పాలకులు తప్పిదాలు ఆంధ్రులకు శాపంగా మారాయన్నారు. అధికారులు సైతం వివక్షకు గురయ్యారు..ప్రశ్నించే దమ్ము చంద్రబాబు, జగన్ కు లేదని..దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారన్నారు.
పవన్ అమెరికా పర్యటన ఖరారు
ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా తన సత్తాచాటుతూ ముందుకు దూసుకెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించి అక్కడి ఎన్ఆర్ఐలతో భేటీ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో వరుస భేటీలు, యాత్రలు, పోరాటాలతో బిజీగా ఉన్న జనసేనాని అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. గతంలోనూ ఒకసారి అమెరికాలో పర్యటించి అక్కడి ఎన్ఆర్ఐలతో భేటీ అయిన పవన్ కల్యాణ్ డిసెంబరు 14న మరోసారి వారితో భేటీకావాలని నిర్ణయించారు. ఇందుకోసం డల్లాస్ వేదికగా ప్రత్యేక కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more